ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ప్రస్తుతం ఎంతో కాళీగా ఇంటికే పరిమితమై పోయారు. అటు సినిమాలు లేక ఇటు టీవీలలో సీరియల్ కూడా ఆగిపోయి ప్రజలు పిచ్చెక్కి పోతున్నారు అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తెలుగు హీరోలు అందరూ బీ ద  రియల్ మాన్ ఛాలెంజ్  అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. లాక్ డౌన్  సమయంలో ఇంట్లో తమ పని తాము చేసుకోవడంతోపాటు ఇంట్లో వాళ్లకి హెల్ప్ చేస్తూ ఉన్న వీడియోని పోస్ట్ చేస్తూ మరో ఇద్దరికి ఈ చాలెంజ్ విసురుతున్నారు  తెలుగు హీరోలు. 

 


 అయితే దీనిపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు హీరోలు అందరూ జనసేన అధినేత సినీ హీరో పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటే ఎంతో బాగుంటుంది అని చెబుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన అభిమానులు పేదలకు ఆహారం అందిస్తే వారికి ప్రత్యేకంగా సోషల్ మీడియా  ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నారూ.. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో తమ గురించి కూడా చెప్పించుకోవాలి అని ఎంతోమంది అభిమానులు సైతం పేదలకు ఆహారాన్ని  సహాయం చేయడం లాంటివి చేస్తున్నారు. ఇదిలా ఉంటే అది తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలందరికీ కోట్లల్లో అభిమానులు ఉంటారు. 

 


 ఇలాంటప్పుడు సినీ హీరోలు ఎవరికైనా పేదలకు సహాయం చేసి తన అభిమానులు ఎంత మంది ఇలాంటి సహాయం చేస్తారో చూద్దాం అంటూ ఒక చాలెంజ్ విసిరితే.. లాక్ డౌన్  సమయంలో తిండి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేదల అందరికీ ఆహారం సహాయం అందుతుంది అని అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక హీరోకు అభిమాని అయి ఉంటారు. దేశంలోని అందరి హీరోలు  ఇలా తన అభిమానులకు పిలుపునివ్వటం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నిరుపేదలు ఎవరు కొంచెం కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి  సెలబ్రిటీలు ఇలా చేస్తారా చేయరా అన్నది మాత్రం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: