స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డి పైన మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాడన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనకు తెలిసిన వారి దగ్గర నుండి ఆమె నెంబర్ సేకరించడం, చాట్ చేయడం స్నేహం చేయడం ప్రేమించడం పెళ్లి చేసుకోవడం ఇలా అల్లు అర్జున్ జీవితంలో అన్నీ చాలా సానుకూలంగా చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో వారిద్దరిని ఒక ముచ్చటైన జంట గా చెప్పుకోవచ్చు.


అల్లు అర్జున్ సినిమాల ద్వారా కోట్లల్లో సంపాదిస్తుంటే... అతని భార్య స్నేహారెడ్డి కూడా తన సొంతంగా ఒక ఆన్లైన్ ఫోటో స్టూడియో ప్రారంభించి లక్షల రూపాయలను సంపాదిస్తోంది. ఆ ఆన్లైన్ ఫోటో స్టూడియో పేరు PICABOO కాగా... ఎవరైనా ఆ సైట్ ని విజిట్ చేసి తమ ఫోటోలను ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లో ఎన్నో రకాల ఫోటో ఎడిటింగ్ ఆప్షన్స్ ఉంటాయి. బొమ్మల పుస్తకాలు తయారు చేయాలన్న ఈ ఫోటో స్టూడియోని ఉపయోగించుకోవచ్చు. 2016లో ఈ ఫోటో స్టూడియో ప్రారంభించగా... మొదటి రెండేళ్లలో లక్షల రూపాయలు డబ్బులు వచ్చాయి. ప్రస్తుతం వేలల్లో డబ్బులు వస్తున్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా స్నేహ రెడ్డి ఐడియా లక్షల రూపాయలు తెచ్చిపెట్టింది.


ఇకపోతే అల్లు అర్జున్ సినిమా లైఫ్ గురించి చెప్పుకుంటే... ప్రస్తుతం ఆయన పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా... మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. పుష్ప మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా... రష్మికా మందాన కథానాయికగా నటిస్తుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం సినిమా షూటింగ్ ప్రారంభం అవ్వనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 2020 లో పుష్ప రిలీజ్ అవ్వాలి కానీ కరోనా మహమ్మారి కారణంగా విడుదల కాస్త వాయిదా పడవచ్చని తెలుస్తుంది. అల్లు అర్జున్ చివరిసారిగా అల వైకుంఠపురములో చిత్రంలో నటించి హిట్ అందుకున్నాడన్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: