మెగాస్టార్ చిరంజీవి - బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్  మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి, నక్సలైట్ గా నటిస్తుండగా చిరు కు జోడిగా కాజల్ కనిపించనుంది. ఇక ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా  ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇప్పటికే ఈ సాంగ్ చిత్రీకరణ కూడా జరిగిపోయింది అయితే తాజాగా మరో స్పెషల్ సాంగ్ కు కూడా ప్లాన్ చేస్తున్నారట.
 
 
ఈసాంగ్ లో ప్రముఖ యాంకర్, నటి అనసూయ నర్తించనుందని ప్రచారం జరుగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈసినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడని తెలిసిందే.  ఫ్లాష్ బ్యాక్ లో ఎపిసోడ్ లో అనసూయ , చరణ్ లపై స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నారట.  ఇక ఇప్పటివరకు 40శాతం ఘాటింగ్  పూర్తి చేసుకోగా జూన్ నుండి హైదరాబాద్ లో  తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది. 
 
 
ఆచార్య కు మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్ టైమెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్స్  బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈఏడాది చివర్లో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఇక  ఈచిత్రం తరువాత చిరంజీవి, మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో భాగంగా ఆచార్య తరువాత  చిరు లూసిఫర్ రీమేక్ లో నటించనున్నాడు. సాహో ఫేమ్ సుజీత్  ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా తోపాటు మెహర్ రమేష్  తో అలాగే వెంకిమామ ఫేమ్ బాబీ డైరెక్షన్ లో సినిమాలు చేయడానికి చిరు ఆసక్తి చూపిస్తున్నాడు. త్వరలోనే  ఈ సినిమాల గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: