టాలీవుడ్ లో కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా గురించి ప్రకటన వస్తే చాలు సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. చిన్న హీరో సినిమా అయినా సరే మన తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ఇది పక్కన పెడితే మెగా ఫ్యామిలీ నుంచి ఒక మల్టీ స్టారర్ సినిమా వస్తుంది అనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. అయినా సరే ఆ సినిమా వచ్చే అవకాశాలు కనపడటం లేదు. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఒక సినిమాను చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

 

ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను  ప్రముఖ సినీ నిర్మాత కళా బంధు సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. అయినా సరే ఈ సినిమాను ఇప్పటి వరకు సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళలేదు అనేది వాస్తవం. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడి గా త్రివిక్రమ్ ఉండే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. ఈ సినిమాను ఎలా అయినా సరే తాను సెట్స్ మీదకు తీసుకొస్తా అని సుబ్బిరామి రెడ్డి ప్రకటించినా సరే చిరంజీవి ఒప్పుకోవడం లేదని అంటున్నారు. 

 

ఈ సినిమాలో నటిస్తే ఎంత పేరు వస్తున్నా సరే పవన్ కళ్యాణ్ చిరంజీవి మాత్రం చేయడానికి ముందుకు రావడం లేదు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చేయడానికి ముందుకు వచ్చినా సరే చిరంజీవి మాత్రం అంతగా ఆసక్తి చూపించలేదు అనేది వాస్తవం. ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్. ఇప్పుడే కాదు గత నాలుగేళ్ల నుంచి కూడా హాట్ టాపిక్. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: