టాలీవుడ్ లో ఇప్పుడు వరుస విజయాలు అందుకుంటూ దుమ్మురేపుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీలో పదమూడేళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ తెరపై కనిపించింది. అంతకు ముందు కొరటాల శివతో శ్రీమంతుడు, భరత్ అనే నేను తో మంచి విజయం అందుకున్న మహేష్ బాబు తర్వాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ తో మరో సంచలన విజయం అందుకున్నాడు. ఈ మూవీ రైతు సమస్యలపై వచ్చింది.. ఇందులో మూడు రకాల పాత్రల్లో కనిపించాడు మహేష్ బాబు. బిజినెస్ మాన్, కాలేజ్ స్టూడెంట్, రైతు పోరాటం చేసే యువకుడిగా అదరగొట్టాడు.
ప్రస్తుతం నే దర్శకుడు పరశురామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. మహేశ్ బాబు వరుసగా సామాజిక సమస్యలతో ముడిపడిన కథలను చేస్తూ వస్తున్నాడు. దాంతో వాటిల్లో హీరోయిన్ పాత్రలకి .. ఆమెతో ప్రేమ ప్రయాణానికి సంబంధించిన నిడివి చాలా తక్కువగా ఉంటూ వస్తోంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ సీన్లు అదిరిపోతాయట.. అయితే మరోసారి మహేష్ బాబు ఓ కాలేజ్ స్టూడెంట్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. మహేష్ బాబు కి కాలేజ్ స్టూడెంట్ గా నటించడం మంచి సెంట్ మెంట్ గా వర్క్ ఔట్ అవుతుందని అంటున్నారు.
గత సినిమాలు శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి ఇలా మూడు సినిమాల్లో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించిన విషయం తెలిసిందే. మరి పరుశరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో మరోసారి కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తే.. సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందా అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఈమూవీ కోసం మహేశ్ బాబు కొంత బరువు తగ్గుతున్నాడని అంటున్నారు. సంక్రాంతి బరిలోకి ఈ సినిమాను దింపే ఆలోచనలో వున్నారు.