ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు వచ్చి డిఫరెంట్ జోనర్ లో ప్రేక్షకులను అలరించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే  రోజు రోజుకు కొత్త దర్శకులు తెరమీదికి వస్తూ సరికొత్త సస్పెన్స్ త్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొత్త దర్శకులు కొత్త ఆలోచనలతో ఎవరూ ఊహించని విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కిస్తున్న భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. 

 

 

 అయితే ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా వచ్చి సరికొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా నిను వీడని నీడను నేను. సందీప్ కిషన్ హీరోగా అన్యా సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలిచిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించనంత  సస్పెన్స్ ఈ సినిమాలో ఉంటుంది. ముఖ్యంగా చివరిలో వచ్చే ట్విస్ట్  అయితే ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. సందీప్ కిషన్ తన భార్యతో కలిసి కారులో వెళుతున్నపుడు ఆక్సిడెంట్ జరుగుతుంది. ఇక అక్కడి నుంచీ ఈ స్టోరీ మొదలవుతుంది. 

 

 

 ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా ప్రధాన పాత్రలో నటించారు.వెన్నెల  కిషోర్ పాత్ర కూడా హీరోతో పాటు చివరి వరకు కొనసాగుతుంది. అయితే ఈ సినిమాలో ఆక్సిడెంట్ లో వెన్నెల కిషోర్ చనిపోయి సందీప్ కిషన్ బాడీ లోకి వచ్చి కథ మొత్తం నడిపిస్తున్నాడు అని అనుకుంటారు ప్రేక్షకులు. కానీ చివరిలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. అసలు చనిపోయింది వెన్నెల కిషోర్ కాదు సందీప్ కిషన్ అతని భార్య అని  చివరిలో ఒక ట్విస్ట్ రివిల్ అవుతుంది  దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు సైతం షాక్ అవ్వాల్సిన  పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: