తెలుగు చిత్ర పరిశ్రమలు ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ దర్శకుడు శేఖర్ కమ్ముల కి మాత్రం ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లవ్ స్టోరీస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న చిత్రాలను తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల ఆయనకు ఆయనే సాటి. ఇక శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమాలన్నీ యూత్ ని బాగా ఆకర్షిస్తుంటాయి. ఎలాంటి వల్గారిటీ లేకుండా మొత్తం ఫ్యామిలీ తో చూసే విధంగా శేఖర్ కమ్ముల సినిమాలు ఆడియన్స్ బాగా ఆకర్షిస్తున్నాయి. సినిమాలో ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా... రియాలిటీకి దగ్గరగా ఉండేలా... శేఖర్ కమ్ముల సినిమాలు... సినిమా లోని పాత్రలు ప్రేక్షకులు ఉంటాయి. అందుకే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంటాయి. అందుకే శేఖర్ కమ్ముల ఏదైనా సినిమా తెరకెక్కిస్తున్నారు అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగి పోతూ ఉంటాయి.
కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల... లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అక్కినేని నాగచైతన్య హీరోగా... సాయి పల్లవి హీరోయిన్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న మొదటి సినిమా ఇదే. ఇక ఫిదా తో తనకు బాగా కలిసి వచ్చిన హీరోయిన్ సాయి పల్లవిని మరోసారి రిపీట్ చేయబోతున్నారు శేఖర్ కమ్ముల. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్... టీజర్ కూ అటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు నాగచైతన్య ఇటు సాయి పల్లవి నటనలో తమకు తామే సాటి అన్న విషయం తెలిసిందే. దీంతో శేఖర్ కమ్ముల సినిమాలో ఇద్దరు అదరగొట్టబోతున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించబోయే నెక్స్ట్ మూవీ పై కూడా తాజాగా స్పష్టత వచ్చింది. ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కిస్తున్న శేఖర్ కమ్ముల ఆ తరువాత మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీలకు కేరాఫ్ అడ్రస్ అయిన శేఖర్ కమ్ముల మరో అందమైన ప్రేమ కథను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ చిత్రాన్ని కూడా ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాను నిర్మిస్తున్న నారాయణ్ దాస్ నిర్మాతగా వ్యవహరించ బోతున్నట్లు సమాచారం. ఇక ఈ లవ్ స్టోరీ సబ్జెక్టు కోసం శేఖర్ కమ్ముల స్టార్ హీరో ని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.