నేషనల్ స్టార్ ప్రభాస్ 20వ చిత్ర అప్డేట్ కోసం అభిమానులు ఎన్నో రోజులుగా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సాహో తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి దాదాపు సంవత్సరం పూర్తి కావొస్తున్నా ఇప్పటి వరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడమే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ రివీల్ చేయాలని అభిమానులు పట్టుబడుతున్నారు.

 

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అనేక విమర్శలు చేసారు. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా అనుకున్న పనులు పూర్తి కాకపోవడం వల్ల ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోతున్నామని, అన్నీ కుదురుకున్నాక ఖచ్చితంగా అభిమానులకి మంచి ట్రీట్ ఉంటుందని వెలిబుచ్చారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చిత్రీకరణకి అనుమతులు లభించాయి. సో మరికొద్ది రోజుల్లో ప్రభాస్ సినిమాపై ఏదో ఒక అప్డేట్ ఉంటుందని నమ్ముతున్నారు.

 

ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి మ్యూజిక్ అందించేది ఎవరనేది ఇంకా తెలియదు. మొదట్లో సైరా నరసింహా రెడ్డి సినిమాకి సంగీతం అందించిన అమిత్ త్రివేది పేరు వినిపించినప్పటికీ,, ఆ తర్వాత అదంతా వట్టి మాటలేనని తెలిసింది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం డైరెక్టర్ రాధాక్రిష్జ తమిళ సంగీత దర్శకుడిని తీసుకున్నారని అంటున్నారు.

 

జస్టిన్ ప్రభాకరన్ అనే యువ సంగీత దర్శకుడు ప్రభాస్ 20వ సినిమాకి మ్యూజిక్ అందించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే రెండు పాటలకి ట్యూన్లు ఇచ్చాడట. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన బయటకి రాలేదు. ఈ సినిమా టైటిల్ తో పాటు సాంకేతిక నిపుణుల పేర్లు కూడా బయటకి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: