ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియ 2018 మార్చి లో టెన్నిస్ క్రీడా కారుడు, బిజినెస్ మేన్ ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యింది. పెళ్లి తరువాత ఎక్కువగా విదేశాల్లో నే ఉంటున్న ఈ బ్యూటీ షూటింగ్ లు ఉంటేనే ఇండియా కు వచ్చి వెళుతోంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఈ జోడి బార్సిలోనా లో చిక్కుకుపోయారు. ఆ సమయంలో శ్రియ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక దశ లో తన భర్త ఆండ్రీకి కరోనా వచ్చిందన్న భయంకూడా అయినట్టు గా సోషల్ మీడియా ద్వారా అభిమానుల తో షేర్ చేసుకుంది.
తాజాగా శ్రియకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ ఫోటో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తో సన్నిహితంగా శ్రియ దిగిన ఫోటో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత తనూజ్ తన ఇన్స్టా స్టోరీ లో శ్రియ తో చాలా క్లోజ్ ఉన్న ఫోటో ను పోస్ట్ చేశాడు. ఫోటో తో పాటు ఇంట్రస్టింగ్ కామెంట్ కూడా చేశాడు. `అప్పట్లో తాగిన మత్తులో ఉన్న రాత్రులు.. మంచి మూమెంట్స్` అంటూ మెసేజ్ చేశాడు. ఈ ఫోటో లండన్ లో దిగినట్టు గా తెలుస్తోంది.
అయితే ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారటంతో నెటిజెన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఈ ఫోటో శ్రియ భర్త చూస్తే పరిస్థితి ఏంటి అంటూ సరదా గా కమెంట్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫోటోతో పాటు మీమ్స్ కూడా చేస్తున్నారు నెటిజెన్లు. ఇక సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ సీనియర్ హీరోదంరి తోనూ కలిసి నటించిన శ్రియ ఇటీవల సినిమాలను తగ్గించేసింది. తెలుగు లో బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తరువాత మరే సినిమాలో కనిపించలేదు.