ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి.... దగ్గుబాటి వంశం నుంచి వచ్చిన రానా కు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ టాలీవుడ్ హంక్ రానా ఈ లాక్ డౌన్ టైంలోనే ప్రముఖ ఈవెంట్ మేనేజర్ మిహీక బజాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు దగ్గుబాటి రానా. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న మన బల్లాల దేవుడు రానా .. నవంబర్ 1నుండీ తన ‘విరాటపర్వం’ షూటింగ్లో తిరిగి జాయిన్ కాబోతున్నాడు.’నీది నాది ఒకే’ కథ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఓ కీలక పాత్రలో ప్రియమణి కూడా నటిస్తుంది. ఇక రానా నటించిన ద్విభాషా చిత్రం ‘అరణ్య'(హాతి మేరీ సాతి) కూడా విడుదల కావాల్సి ఉంది.

నిజానికి లాక్ డౌన్ కు ముందే ఈ చిత్రం విడుదల కావాలి కానీ కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. సరే ఈ విషయాల్ని పక్కన పెట్టేస్తే.. కొద్ది రోజుల నుండీ రానా ఓ బయోపిక్ లో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. దివంగత స్టార్ హీరో శోభన్ బాబు బయోపిక్లో రానా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల పై తాజాగా రానా సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

‘నాకు ఎటువంటి బయోపిక్లో నటించే ఓపిక తనకు లేదని.. ప్రముఖుల బయోపిక్లలో నటిస్తే ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఏర్పడతాయని. ఆ అంచనాలను అందుకోవాలని.. ముఖ్యంగా ఆ గొప్ప నటులను మ్యాచ్ చెయ్యాలి అంటే చాలా హోమ్ వర్క్ చెయ్యాల్సి ఉంటుందని. ఇప్పుడు అంత టైం.. అలాగే ఓపిక లేవని’ రానా చెప్పినట్టు వారి సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. గతంలో రానా ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: