తెలుగులో నాగ ‌చైత‌న్య స‌ర‌స‌న ఒక‌ లైలా కోసం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూజా ఎన్నో విక్రమార్క ప్రయత్నాల తరువాత చేసిన డీజే సినిమాతో దశ తిరిగింది. అప్పుడు మొదలు అయిన ఆమె విజ‌య‌ప‌రంప‌ర అల వైకుంఠ‌పుర‌ములో వ‌ర‌కు సాగింది. డీజే సినిమా నుండి ఆమె సౌత్ లో టాప్ హీరోయిన్‌ గా తన సత్తా చాటుతోంది. ఈమె ప్రస్తుతం ప్ర‌భాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియన్ మూవీ రాధే శ్యామ్‌ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. మొన్నీ మధ్య విడుదలైన రాధేశ్యామ్‌ ఫస్ట్ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది.

ప్రభాస్ హీరో కావడం తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ముందు నుండే ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పూజా హేగ్డే డ్యూయల్ రోల్ చేయనుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె మ్యూజిక్ టీచర్ గా నటిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ అంతా ఇటలీలో ఉంది. సినిమాని కీలక సన్నివేశాలని అక్కడ షూట్ చేస్తున్నారు. అయితే ఈ డ్యూయల్ రోల్ వార్తల నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చింది పూజ.

తను ఈ మూవీ లో డ్యూయల్ రోల్ చేయడం లేదని ఆమె స్పష్టం చేసింది. ఇక అక్టోబర్‌ 23న హీరో ప్రభాస్‌ పుట్టినరోజు, ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో ‘రాధేశ్యామ్‌’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారని నిన్న ప్రకటించారు. 'వాళ్లు మిమ్మల్ని మరోసారి కచ్చితంగా ప్రేమలో పడేస్తారు' అక్టోబర్‌ 23న మోషన్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం’ అంటూ మేకర్స్‌ ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: