ప్రభాస్ హీరో కావడం తో ఈ సినిమా మీద భారీ అంచనాలు ముందు నుండే ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పూజా హేగ్డే డ్యూయల్ రోల్ చేయనుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె మ్యూజిక్ టీచర్ గా నటిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ అంతా ఇటలీలో ఉంది. సినిమాని కీలక సన్నివేశాలని అక్కడ షూట్ చేస్తున్నారు. అయితే ఈ డ్యూయల్ రోల్ వార్తల నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చింది పూజ.
తను ఈ మూవీ లో డ్యూయల్ రోల్ చేయడం లేదని ఆమె స్పష్టం చేసింది. ఇక అక్టోబర్ 23న హీరో ప్రభాస్ పుట్టినరోజు, ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో ‘రాధేశ్యామ్’ మోషన్ పోస్టర్ను విడుదల చేయబోతున్నారని నిన్న ప్రకటించారు. 'వాళ్లు మిమ్మల్ని మరోసారి కచ్చితంగా ప్రేమలో పడేస్తారు' అక్టోబర్ 23న మోషన్పోస్టర్ను విడుదల చేస్తున్నాం’ అంటూ మేకర్స్ ప్రకటించారు.