అయితే ఈ సినిమా తరువాత చిరు చేయబోయే సినిమా పై కొంత అయోమయం నెలకొంది. వాస్తవానికి చిరు వివి వినాయక్, మెహర్ రమేష్, బాబీ సినిమాలను లైన్ లో ఉంచాడు.. అయితే వీటిలో ఏ సినిమా ఆచార్య తరువాత ఉంటుందనేది ఇంకా క్లారిటీ రాలేదు.. గత కొన్ని రోజులుగా చిరంజీవి తర్వాతి సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో ని లూసిఫర్ అనుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ సినిమా కాదని అంటున్నారు.. ఈ సినిమా తర్వాత మెహర్ దర్శకత్వంలోనే చిరు సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. మెగా స్టార్ చిరంజీవి సినిమాల విషయంలో, కథ విషయంలో, డైరెక్టర్ ల విషయంలో ఎంత శ్రద్ధగా ఉంటాడో అందరికి తెలిసిందే.. కథ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ సినిమా ని పక్కనపెట్టేయడంలో ఎలాంటి ఆలోచన చేయదు.. కథ విషయంలో కొంత తేడాగా ఉండడంతో వివి వినాయక్ దర్శకత్వంలో ని సినిమా ని హోల్డ్ లో పెట్టాడట..
ఇక తాజాగా సమాచారం ప్రకారం చిరు మరొక రీమేక్ సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. రీ ఎంట్రీకి ఎంచుకున్న ఖైదీ నెంబర్ 150 అరవం నుంచి తీసుకొచ్చిన కత్తి . త్వరలో మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ఐదేళ్ల క్రితం వచ్చిన తమిళ మూవీని రీమేక్ చేయడం గురించి ఇప్పటికే మిశ్రమ స్పందన ఉంది.అలాగే మలయాళం లూసిఫర్ రీమేక్ కోసం వివి వినాయక్ రంగంలోకి దిగుతాడు. రచయిత ఆకుల శివతో కలిసి ఇప్పటికే స్క్రిప్ట్ పనులు వేగవంతం చేసినట్టు తెలిసింది.ఇవి చాలవు అన్నట్టు అజిత్ నటించిన మరో సినిమా ఎన్నై ఆరిందాళ్ కూడా చేసే ఆలోచన చిరు చేస్తున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ఇది కూడా 2015లో వచ్చిన సినిమానే. అనుష్క హీరోయిన్. గౌతమ్ మీనన్ దర్శకుడు. తెలుగులో ఎంతవాడుగాని పేరుతో డబ్ చేస్తే ఓ మోస్తరుగా ఆడింది. ఆల్రెడీ తెలుగు లో వచ్చిన సినిమాలని రీమేక్ చేస్తూ చిరంజీవి కి ఏమైంది అన్న అనుమానం అభిమానుల్లో ఉంది..