స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప సినిమాకు ముందునుండి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సినిమా అలా మొదలుపెట్టగానే కరోనా లాక్ డౌన్ రాగా 3 కోట్ల వరకు ఖర్చు పెట్టి తీసిన రష్ అంతా వేస్ట్ అయ్యిందని టాక్. ప్రస్తుతం టీం అంతా సినిమా షూటింగ్ లొకేషన్స్ వెతికే పనిలోనే ఉన్నారు. అల్లు అర్జున్ ఊర మాస్ అవతార్ గా వసుత్న్న పుష్ప సినిమాలో తన సత్తా చాటుతాడని అంటున్నారు.

ఆర్య, ఆర్య 2 తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప వస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారు అన్నది ఇంకా తెలియలేదు. విజయ్ సేతుపతి, మాధవన్ వంటి స్టార్స్ నటిస్తున్నారని వార్తలు వచ్చినా వాటిల్లో ఏది వాస్తవం కాదని తెలుస్తుంది.

పుష్పలో బాలీవుడ్ విలన్ నటిస్తాడని టాక్ వచ్చింది. రంగస్థలం సక్సెస్ తర్వాత సుకుమార్, అల వైకుంఠపురములో సూపర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి పుష్ప ఆశించిన స్థాయిలో అంచనాలు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. సినిమాలో ఇంకా నటీనటుల ఎంపిక జరుగుతుంది. త్వరలో మొదలవుతున్న ఈ సినిమాలో 2021 సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తుంది.                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: