టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా సక్సెస్ తో మంచి క్రేజ్ ని దక్కించుకున్నారు. అంతకముందు రెండేళ్లుగా సరైన సక్సెస్ కోసం తపించిన అల్లు అర్జున్ కి ఆయన అభిమానులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ ని అందించింది అనే చెప్పాలి. ఇక సినిమాతో పాటు ఇందులోని పాటలు అయితే మరింత గొప్ప విజయాన్ని అందుకుని జాతీయ స్థాయిలో శ్రోతలకు విశేషంగా అలరించి యూట్యూబ్ లో అయితే వందల మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూనిట్ మొత్తానికి గొప్ప పేరు తెచ్చిపెట్టాయి.

ఇకపోతే దీని తరువాత ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప. క్రియేటివ్ సినిమాల దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో తీస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన సుకుమార్, ఎలాగైనా ఈ పుష్ప ని కూడా భారీ సక్సెస్ చేసేలా అన్ని విషయాల్లోనూ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. శేషాచలం అడవుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పలు యాక్షన్, ఎమోషనల్ అంశాలు కలగలిపి తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తుండగా దీనిని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ చాలా గ్యాప్ తరువాత దీని ద్వారా బన్నీ సినిమాకు పని చేస్తున్నారు.

ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకు సంబందించిన ఒక అప్ డేట్ మరొక రెండు రోజుల్లో అనగా దసరా పండుగ సందర్భంగా రానుందని అంటున్నారు. అయితే అది ఏమిటో, అసలు ఆ రోజున సినిమా నుండి నిజంగానే అప్ డేట్ వస్తుందో లేదో తెలియాంటే మరికొన్ని గంటలు ఆగాలని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది నిజంగా బన్నీ ఫ్యాన్స్ కు అతి పెద్ద పండుగ వార్తే అని చెప్పకతప్పదు... !!

మరింత సమాచారం తెలుసుకోండి: