సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు దసరా సంధర్భంగా తన ఫ్యాన్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పారు. అది కూడా ఏకంగా ఆరు బాషలలో చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇంగ్లీష్, తెలుగు, హిందీ. మలయాళం, తమిళం. కన్నడ బాషలలో ఈ విషెస్ చెప్పారు. నిజానికి  ఏడాది మొదటిలో సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్. అల్లు అర్జున్ అల వైకుంటపురంలో తో పోటీ పడి మరీ హిట్టు కొట్టాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పటి లానే రెస్ట్ మోడ్ లోకి వెళ్ళాడు. ముందే తదుపరి సినిమాకి ఒక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని అనుకున్నా ఇంతలో కరోనా ఎంటర్ కావడంతో ఆయన మరింత ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి.

 ఈ కరోన దెబ్బకు అతని తదుపరి ప్రాజెక్ట్ సర్కారు వారి పాట మరింత ఆలస్యం అవనుంది. ఈ సినిమా షూట్ వచ్చే నెల మొదట్లో ప్రారంభమవుతుందని అంటున్నారు. పరశురామ్ దర్శకుడుగా తెరకెక్కనున్న ఈ సినిమాని మహేష్ బాబు విరామం లేకుండా ఏకబిగిన షూట్ చేసి పూర్తి చేసే యోచనలో ఉన్నారు.  అయితే సినిమా కథ బ్యాంకింగ్ మోసాల చుట్టూ తిరగనుందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం పెద్దగానే ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.

 బ్యాంకింగ్ మోసాలకు పాల్పడి దేశం దాటిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళ మీదే ఈ సినిమా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాని ప్యాన్ ఇండియన్ లెవల్ లో ప్లాన్ చేసేందుకే వేరే బాషల నటులని కూడా రోప్ చేసారని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు ఎంతవరకూ ఉన్నాయనే దాని మీద చర్చలు జరిగినా నేటి మహేష్ బాబు ట్వీట్ తో దానికి మరింత ఊతం ఇచ్చినట్టు అయింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: