ఈ కరోన దెబ్బకు అతని తదుపరి ప్రాజెక్ట్ సర్కారు వారి పాట మరింత ఆలస్యం అవనుంది. ఈ సినిమా షూట్ వచ్చే నెల మొదట్లో ప్రారంభమవుతుందని అంటున్నారు. పరశురామ్ దర్శకుడుగా తెరకెక్కనున్న ఈ సినిమాని మహేష్ బాబు విరామం లేకుండా ఏకబిగిన షూట్ చేసి పూర్తి చేసే యోచనలో ఉన్నారు. అయితే సినిమా కథ బ్యాంకింగ్ మోసాల చుట్టూ తిరగనుందని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం పెద్దగానే ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.
బ్యాంకింగ్ మోసాలకు పాల్పడి దేశం దాటిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వాళ్ళ మీదే ఈ సినిమా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాని ప్యాన్ ఇండియన్ లెవల్ లో ప్లాన్ చేసేందుకే వేరే బాషల నటులని కూడా రోప్ చేసారని చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు ఎంతవరకూ ఉన్నాయనే దాని మీద చర్చలు జరిగినా నేటి మహేష్ బాబు ట్వీట్ తో దానికి మరింత ఊతం ఇచ్చినట్టు అయింది.