కన్నడ సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లవ్ మోక్ టైల్ సినిమాని తెలుగులో రూపొందిస్తున్నారు. నాగ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రీమేక్ చిత్రానికి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, టాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కాగా.. అనేక కారణాల వలన షూటింగ్ వాయిదా పడింది. కరోనా కారణంగా ఇన్ని రోజులు షూటింగ్ వాయిదా పడగా.. కొద్ది వారాల క్రితం తమన్నా కరోనా వైరస్ బారిన పడడంతో షూటింగ్ ఇంకా వాయిదా పడింది.


ఇటీవల హైదరాబాద్ నగరంలో వరదలు పోటెత్తడంతో మళ్లీ సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ఈ సినిమా పూర్తి కావడానికి చాలా రోజులు పడుతుంది. ఈ నేపథ్యంలోనే సినీ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతోంది. అదేంటంటే.. తమన్నా,  సత్యదేవ్ పారితోషికం విషయంలో ఏవో కొన్ని విభేదాలు వచ్చాయని.. మొత్తానికి సినిమా బడ్జెట్ విషయంలో తేడాలు వచ్చాయని.. అందుకే సినిమాని అర్ధాంతరంగా నిలిపివేస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది.


అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి సత్యం లేదని హీరో సత్యదేవ్ వెల్లడించారు. సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం అవుతుందని కూడా ఆయన వెల్లడించారు. దీంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు అందరూ కూడా ఊపిరిపీల్చుకున్నారు. ప్రసంగం తప్పుడు ప్రచారం చేస్తూ అందరి సమయాన్ని వృధా చేయడానికి కొందరు ఉంటారని నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహానికి గురవుతున్నారు.


ఇదిలా ఉండగా తమన్నా భాటియా ప్రస్తుతం ముంబై నగరం లోనే ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఆమె మంచి చిత్రాల్లో నటించలేకపోయారు. సత్యదేవ్ మాత్రం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాలతో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మంచి కథా బలం తో రాబోయే సినిమా ఎంత బాగుంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: