సాధారణంగా సంక్రాంతి, దసరా పండగ సీజన్లకు, వేసవి సెలవుల్లో సినిమాల విడుదలకు మంచి టైమ్ గా భావిస్తారు. కలెక్షన్లు ఎక్కువగా వచ్చేది.. ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకాదరణ దక్కేది ఆ సమయాల్లోనే. అయితే.. ఈ ఏడాది సంక్రాంతి మినహా మంచి సీజన్లన్నింటినీ కరోనా కమ్మేసింది. దీంతో ఏ హీరో ఎప్పుడు వస్తాడో.. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ధియేటర్లో రిలీజ్ అవుతుందా.. ఓటీటీకి వెళ్లిపోతుందా..? అనేది పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. అయితే.. ఈ పరిస్థితులను దాటి ఇద్దరు మెగా హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

వారిద్దరూ అన్నదమ్ములు కూడా కావడం విశేషం. వారు.. సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. వీరిలో సాయిధరమ్ తేజ్ సినిమా సోలో బ్రతుకే సో బెటర్. వైష్ణవ్ తేజ్ సినిమా ‘ఉప్పెన’. వీటిలో పాటలతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి రేకెత్తించిన సినిమా ఉప్పెన. వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రేజ్ తోనే ఇన్నాళ్లూ ఓటీటీకి వెళ్లకుండా ధియేటర్ రిలీజ్ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు ధియేటర్లు ఓపెన్ కావడంతో నవంబర్ లో విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. పైగా.. వైష్ణవ్ తేజ్ కు ఇది తొలి సినిమా. తొలి సినిమా టెన్షన్, మజా అన్నీ వైష్ణవ్ తో వెయిట్ చేయిస్తున్నాయి.


ఓపక్క అన్నయ్య సాయితేజ్ సినిమా సోలో బ్రతుకే.. కూడా నవంబర్ రిలీజ్ పై ఆలోచిస్తున్నారట. దీంతో ఇద్దరు మెగా హీరోలే కాకుండా.. అన్నదమ్ములైన వీరి సినిమాలు ఒకే నెలలో సందడి చేస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి గాసిప్స్ లా రౌండ్ అవుతున్న ఈ వార్తలపై అఫీషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు ఇది హ్యాపీ న్యూసే.


మరింత సమాచారం తెలుసుకోండి: