బాలకృష్ణ బోయపాటిల కాంబినేషన్ మూవీకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది అని నిరూపించే ఒక ఆసక్తికర సంఘటన ఈమధ్య జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. ఈమూవీ షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే కరోనా సమస్యలు రావడంతో కేవలం 10 శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకుంది.


అయితే ఈమూవీ కథ చాల డిఫరెంట్ గా ఉంటుంది అన్న లీకులు జెమినీ టివి నిర్వాహకులకు అందడంతో పాటు ఈమూవీ టీజర్ కు వచ్చిన అనూహ్య స్పందనను చూసి జెమినీ నిర్వాహకులు ఈమూవీ నిర్మాణం పూర్తి కాకుండానే ఈమూవీ శాటిలైట్ హక్కులను జెమినీ 11.5 కోట్లకు కొనుక్కున్నట్లుగా వార్తలు రావడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. అంతేకాదు ఈ మూవీ డిజిటల్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ 9 కోట్లకు కొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.


దీనితో కేవలం 10 శాతం షూటింగ్ పూర్తి అయిన ఈసినిమాకు ఇంత మార్కెట్ ఏర్పడిందా అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. కరోనా పరిస్థితులు నెమ్మదిగా అదుపులోకి రావడంతో ఈ మూవీ షూటింగ్ ను నిన్నటి నుండి ప్రారంభించారు. అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ బాలయ్య నిన్నటి షూట్ లో చాల ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా తన తీరులో మొట్టమొదటి రోజే భారీ డైలాగ్ చెప్పి ఈమూవీ యూనిట్ సభ్యులకు షాక్ ఇచ్చినట్లు టాక్.

ఈ చిత్రాన్ని వేగంగా పూర్తిచేసి వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేయాలని బోయపాటి ఆలోచన ఈమూవీలో విలన్ గా సోను సూద్ ను ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోను సూద్ కు ప్రస్తుతం ఉన్న పాపులారిటీ చిత్రానికి కూడా హైప్ తీసుకు వస్తుందని బోయపాటి నమ్మకం. ఈమూవీలో బాలయ్య అఘోరా గెటప్ హైలెట్ కావడమే కాకుండా ఆ పాత్ర కోసం ఇప్పటికే బాలకృష్ణ చాల హోంవర్క్ చేసినట్లు తెలుస్తోంది. బోయపాటి బాలయ్య ల కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయి మళ్ళీ బాలయ్య ట్రాక్ లోకి వస్తాడని అతడి అభిమానుల ఆశ..

మరింత సమాచారం తెలుసుకోండి: