అనసూయ జబర్దస్త్ తో బాగా ఫేమస్ అయ్యింది .. తన అందంతో ,అభినయంతో జబర్దస్త్ షో ద్వారా తెలుగు  ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంది ..ఒక్క జబర్దస్త్ షో నే కాదు, స్టార్ మా లో ప్రసారమయ్యే కార్యక్రమాలలో  వ్యాఖ్యాతగా తన దైన శైలిలో ముందుకు దూసుకుపోతుంది ..  అటు వ్యాఖ్యాతగా చేస్తూ సినిమా రంగంలోనూ అడుగుపెట్టింది.. సుకుమార్ రంగస్థలం లో రంగమ్మ అత్త గా  అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది ...దాంతో పాటు అడివి శేష్ క్షణం సినిమాలో నెగటివ్ షేడ్ పాత్రలో నటించి మెప్పించింది

తాజాగా జబర్దస్త్ యాంకర్ మాతృత్వం పై తన మనసులోని మాటలను బయట పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది..  ఏ  భార్య భర్త లైన  ఇద్దరు పిల్లలు ఉంటే చాలు  అనుకునే రోజులివి ..కానీ  తనకి మూడోసారి సంతానం  పొందాలని  ఉందంటూ తాజాగా తన మనసులో మాటల్ని బయట పెట్టింది ఈ జబర్దస్త్ బ్యూటీ .. మూడో సారి గర్భం దాల్చడం లో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మూడో బిడ్డకు తల్లి కావాలని ఉందంటూ చెబుతున్న మాటలు నెట్టింట్లో వైరల్ గా  మారాయి..

అనసూయ థాంక్యూ బ్రదర్ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే ..  అయితే రెండు రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో అనసూయ గర్భవతి పాత్రలో కనిపించింది ..అయితే నెటిజన్లు ఆ పోస్ట్ ని చూడగానే అనసూయ మరోసారి తల్లి అయిదంటూ విపరీతంగా ట్రోల్ల్స్ చేసారు ..  
ఈ విషయమై మీడియాతో మాట్లాడిన అనసూయ మాతృత్వం గురించి చాలా గొప్పగా చెప్పింది..మరోసారి మాతృత్వ ఆనందం పొందాలని ఉందంటూ చెప్పింది ..  ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అనసూయ మరోసారి మాతృత్వం పొందాలని చెబుతుండటంతో  అనసూయ ఈ మాటని సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం చెప్పిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: