రాజమౌళి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ అనే ఒక ప్రతిష్టాత్మక సినిమా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ముందు నుంచి నెలకొని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇద్దరు స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు కొమురం భీం జీవిత కథలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో రాజమౌళి చాలా రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఒక పక్క షూటింగ్ జరుగుతుండగా మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది అని అంటున్నారు. 


అయితే ఇది వరకు రాజమౌళి ఒక సినిమాకి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అంతా ఒక కంపెనీకి అప్పగించేవాడు. అయితే వాళ్ళు ఎప్పుడు పూర్తి చేసి ఇస్తే అప్పుడు సినిమా రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ ఈ సినిమా విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకున్న రాజమౌళి ఈ వర్క్ ని డివైడ్ చేసి పలు దేశాలలో ఉన్న నిపుణుల చేత పని చేయించుకుంటున్నారు. చాలా దేశాలలో మనకు పగలు అయితే వారికి రాత్రి ఉంటుంది. 


వారికి రాత్రి అయితే మనకి పగలు. వారితో ఇంటరాక్ట్ అవడానికి గాను రాజమౌళి రాత్రులు మేలుకొనే ఉంటున్నాడని అంటున్నారు. ఎలాగైనా ఈ సినిమాని దసరాకి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రాజమౌళి ఎంతో తపన పడుతున్నాడని తెలుస్తోంది. అయితే మరోపక్క ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. బహుశా ఈ సినిమా దసరా సమయానికి పూర్తి కాకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే రాజమౌళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకి రిలీజ్ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: