కాగా 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నటుడు సూర్య ఈ మూవీని ఎంతో గ్రౌండ్ లెవెల్లో నిర్మించడం జరిగింది. నిజానికి ఈ సినిమా కథను మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు కి వినిపించాడు విక్రమ్ కె కుమార్. అయితే కథ విన్న మహేష్ బాబు ఎంతో అద్భుతంగా ఉందని, తప్పకుండా ఇది సక్సెస్ సాధిస్తుందని కానీ తెలుగులో ఇటువంటి సినిమాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయనేది తాను చెప్పలేనని అందువలన ఈ మూవీని కోలీవుడ్ స్టార్ సూర్యా తో చేస్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని తనకు మహేష్ సలహా ఇచ్చారని పలు సందర్భాల్లో దర్శకుడు విక్రమ్ కుమార్ తెలిపిన విషయం తెలిసిందే. ఇక మరోవైపు ప్రచారమవుతున్న వార్తలను బట్టి బట్టి అతి త్వరలో 24 సీక్వెల్ పక్కాగా మహేష్ బాబుతో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడట దర్శకుడు విక్రమ్ కె.కుమార్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథా కథనాలు పూర్తిగా సిద్ధం చేసిన విక్రమ్ అతి త్వరలో వాటిని మహేష్ కి వినిపించనున్నారని అలానే మహేష్ బాబు, జీఎంబి ఎంటర్టైన్మెంట్స్ తో పాటు మరో అగ్ర నిర్మాణ సంస్థ కలిసి ఎంతో భారీ ఖర్చుతో ఈ మూవీ తెరకెక్కించనుందని సమాచారం.
మొదటి భాగాన్ని మించేలా రెండో భాగంలో మరింత ఆకట్టుకునే అంశాలతో పాటు ఊహించలేని కొన్ని పలు ట్విస్టులు కూడా ఉంటాయని అంటున్నారు. అలానే మహేష్ బాబు ఇమేజ్ కి తగ్గట్లు కూడా పలు కమర్షియల్ అంశాలు కూడా జోడించాడట విక్రమ్ కుమార్. కాగా ఈ సినిమా ఒకవేళ ఫిక్స్ అయితే ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే దానిపై మాత్రం ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదని ఎందుకంటే ఇప్పటికే మహేష్ బాబు వరుసగా సినిమాలు ఎంచుకుంటూ కొనసాగుతున్నందున మరొక రెండేళ్ళ తర్వాతనే 24 సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారిక న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు......!!