బిగ్ బాస్ హౌస్ అనేది కొత్త స్నేహాలను ఏర్పరుస్తుందన్న సంగతి అందరికీ తేలింది. ఒకప్పుడు బిగ్ బాస్ హౌస్ గురించి ఉన్న అభిప్రాయాన్ని ఈ సీజన్ పూర్తిగా మార్చేసింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే కొత్త ప్రాబ్లెమ్స్ వస్తాయని ఒకప్పుడు భావించేవారు. కానీ, సీజన్ 4 మాత్రం అందుకు మినహాయింపు. కంటెస్టెంట్స్ అందరూ మంచి పేరునే తెచ్చుకున్నారు. నెగటివిటీను మూటగట్టుకోలేదు. నిజానికి, కొత్త కొత్త ఆఫర్స్ ను అందుకుంటున్నారు .

హౌస్ లో టాస్కులలో కొట్టుకున్నా ఆ తరువాత ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా ఉండేవారు. అందుకే, సీజన్ 4 కంటెస్టెంట్స్  హైలైట్ గా నిలిచారు. వీళ్లందరిలో అఖిల్ అలాగే మోనాల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బుల్లితెరలో విలన్ రోల్ లో ప్రేక్షకులకు సుపరిచితమైన అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ గజ్జర్ తో స్నేహంగా ఉండటం అందరినీ ఆకర్షించింది. మోనాల్ అలాగే అఖిల్ మధ్య బాండింగ్ అనేది బాగా పాపులరైంది. మోనాల్ అలాగే అఖిల్ ఎప్పటికీ కలిసే ఉంటారు అన్న విధంగా అభిమానులలో ఓ అభిప్రాయం ఏర్పడింది.

ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ మోనాల్ తన అసంతృప్తిని బయటపెట్టింది. తనను గుర్తుపడుతున్న ప్రతి ఒక్కరూ అఖిల్ గురించి అడుగుతున్నారని చెప్పుకొచ్చింది. అఖిల్ తన పనులలో తాను బిజీగా ఉంటాడని, ప్రతిసారి తన చుట్టూనే తిరగడని క్లారిటీ ఇచ్చింది. అలాగే, తాను కూడా చాలా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నానని గుర్తుచేస్తోంది. అఖిల్ తో తనకు బాండింగ్ ఏర్పడటం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. బాండింగ్ ఉన్నంత మాత్రాన ఇరవై నాలుగు గంటలూ కలిసే ఉంటామని అనుకోవడం మాత్రం తనకు నవ్వు తెప్పిస్తోందని చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే, మోనాల్ కొత్త సంవత్సరంలో బిగ్ బాస్ షో తెచ్చిన కొత్త ఉత్సాహంతో ముందుకు వెళుతోంది. తన వద్దకి వచ్చిన ప్రతి అపార్ట్యూనిటీను అందిపుచ్చుకుంటోంది. డాన్స్ ప్లస్ షో తో బుల్లితెర వీక్షకులను అలరిస్తూనే వెండితెరపై కూడా అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: