టాలీవుడ్ లో ఒక గొప్పతనం ఉంది. ఎవరైనా మంచి టాలెంట్ చూపిస్తే వారిని తెచ్చి మంచి ఆఫర్లు ఇస్తుంది. తెలుగు తెరపైన వారిని గొప్పగా చూపిస్తుంది. ఈ విషయంలో ఇతర భాషల కంటే కూడా తెలుగులోనే ఎక్కువగా ఉదారత ఉంటుందని అంతా చెబుతారు. ఇప్పటికే టాప్ హీరోయిన్స్ ని ముంబై నుంచి తెస్తున్న టాలీవుడ్ ఇపుడు మరో ప్రయోగం చేయబోతోంది

అదేంటి అంటే ఏకంగా లేడీ విలన్స్ కి కూడా పక్క రాష్ట్రాల నుంచి తేవడం. తెలుగులో లేడీ విలన్స్ పెద్దగా లేరు. టీవీ సీరియల్స్ లో లేడీ విలన్స్ కనిపిస్తారు తప్ప వెండి తెరను పండించే వారు అయితే లేరు. టాప్ హీరోయిన్స్ గా రాణించి ఇపుడు క్యారక్టర్లు వేస్తున్న వారు కూడా అవుట్ అండ్ అవుట్ విలనీని తెర మీద చూపించడానికి జంకుతారు.

దానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఇపుడు క్రాక్ మూవీ హిట్ కావడంతో జయమ్మ మీద టాలీవుడ్ కన్ను పడింది అంటున్నారు. ఈ మూవీలో విలన్ సముద్ర ఖని పక్కన జయమ్మగా నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ కి వెల్లువలా ఆఫర్లు వస్తున్నాయట. ఆమెకి తెలుగులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను ఆఫర్ చేయడానికి టాలీవుడ్ సై అంటోందిట.

ఎందుకంటే పవర్ ఫుల్ విలనీని తనదైన శైలిలో వరలక్ష్మి బాగా  పండిస్తోంది. ఆమె ఇప్పటిదాకా తెలుగులో నటించిన స్టెయిట్  మూవీ తెనాలి రామక్రిష్ణ మాత్రమే. అందులో ఆమె విలన్ గా చేసినా కూడా హిట్ కాకపోవడంతో ఎవరూ పట్టించుకోలేదు. అయితే క్రాక్ సూపర్ హిట్ అవడంతో ఇపుడు రవితేజాతో పాటు ఆమె నటన కూడా అందరూ మాట్లాడుకునేలా చేస్తోందిట. ఆమెకు పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్స్ తెలుగులో రెడీగా ఉన్నాయట. మరి వలలక్ష్మి  ఓకే అంటే టాలీవుడ్ లో జయమ్మ దూకుడు ఓ రేంజిలో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: