తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కరోనా  వైరస్ బారిన పడ్డారు అనే విషయం తెలిసిందే. ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు ఇక ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా కరోనా రావడంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. ఇవ్వలే  కరోనా వైరస్ బారిన పడ్డాను అంటూ చెప్పిన రామ్ చరణ్.. తనతో గత కొన్ని రోజుల నుంచి కలిసి ఉన్న వారు అందరూ కూడా వెంటనే కరోనా పరీక్షలు చేసుకోవాలని అంతేకాకుండా క్వారంటైన్ లో ఉండాలి అంటూ సూచించారు. ఒక కరోనా వైరస్ టెస్టులో తనకు పాజిటివ్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్.



 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరగా కరోనా వైరస్ బారినుంచి కోలుకోవాలి అని అటు ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు.  రామ్ చరణ్ వైద్యుల పర్యవేక్షణలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన కరోనా పరీక్షలు చేసుకోగా ఆమెకు నెగిటివ్ వచ్చింది. అయినప్పటికీ కొన్ని రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి అని అటు వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఉపాసన రామ్ చరణ్ కలిసి క్వారంటైన్ లో ఉన్నారు. క్వారంటైన్ లో ఉన్న సమయంలో తమకు ఎదురైన అనుభవాలను ఇటీవల ఉపాసన అభిమానులతో పంచుకున్నారు




 ముందుగా చరణ్ కు కరోనా పాజిటివ్ అని తెలియగానే అందరూ ఎంతగానో కంగారు పడిపోయాము  అంటూ ఉపాసన తెలిపింది.  ఆ తర్వాత తాను కరోనా టెస్ట్  చేసుకోగా తనకు నెగిటివ్ అని వచ్చినప్పటికీ ఇక ముందు జాగ్రత్త లో భాగంగా తాను కూడా క్వారంటైన్ లో ఉండాలి అని డాక్టర్లు సూచించారు అంటూ చెప్పుకొచ్చింది . ఇక ఈక్రమంలోనే చరణ్ తో  కలిసి క్వారంటైన్ లో ఉన్నాను అంటూ తెలిపింది.  మొదటి రెండు మూడు రోజులు ఎంతో గందరగోళానికి గురయ్యామని.. ఇబ్బంది పడ్డాం అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఆ తర్వాత మాత్రం ప్రేమ ఆప్యాయత తో ఉన్నాము  అంటూ తెలిపింది ఉపాసన.

మరింత సమాచారం తెలుసుకోండి: