మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. మొదటి సినిమాతోనే నాన్ బాహుబలి కేటగిరీలో ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలు చేసింది. ఆ తరువాత ఈ ప్రొడక్షన్ హౌస్ కి వరుస ఫ్లాప్ సినిమాలు ఎదురయ్యాయి. వాటి నుంచి కోలుకోవడానికి కచ్చితంగా హిట్ అవుతాయని అనుకున్నా సినిమాలను మాత్రమే చేస్తూ వెళుతోంది ఇప్పుడు.


ప్రస్తుతానికి చిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమా, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాలను మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా అనౌన్స్ చేసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి తో బాబి తెరకెక్కించే సినిమాని కూడా తమ ప్రొడక్షన్ హౌస్ లోనే చేయనుంది.



తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సంస్థ బాలకృష్ణతో కూడా ఓ సినిమా చేయాలని భావిస్తోంది. బాలకృష్ణ కూడా సినిమా చేస్తానని వీరికి మాట ఇచ్చాడట. గోపీచంద్ మలినేని కూడా ఈ సంస్థకు ఒక సినిమా ఇంతకు ముందే కమిట్ అయ్యాడు. అలా బాలకృష్ణను దర్శకత్వం వహించే బాధ్యత గోపీచంద్ మలినేని కి దక్కింది. ఆయన కూడ స్వతహాగా బాలకృష్ణ ఫ్యాన్ కావడంతో ఈ సినిమాని మరో రేంజ్ లో తెరకక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ముందుగా కుర్ర హీరోలందరినీ కవర్ చేసిన మైత్రి మూవీస్ సంస్థ ఇప్పుడు బాలకృష్ణ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో సినిమా చేయడం చర్చనీయాంశంగా మారింది. కుర్ర హీరోలను వదిలేసి సీనియర్ హీరోల వెంట ఎందుకు వెంట పడుతోంది అనే ఆశక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: