ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో నటుడు వరుణ్ ధావన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇక నటనలో తనదైన శైలిలో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.  కేవలం బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాదు అటు ఎన్నో కమర్షియల్ ప్రకటనల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోజూనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు వరుణ్ ధావన్.  అయితే బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ పెళ్లి చేసుకున్నాడు.



 అయితే ఎలాంటి సమాచారం లేకుండానే మీడియాకు తెలియకుండా ఇటీవలే పెళ్లి చేసుకున్నాడు వరుణ్ ధావన్. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా ను  ఇటీవలే బంధు మిత్రులు పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఇక వరుణ్ ధావన్ వివాహం అట్టహాసంగా జరిగింది. ఇటీవలే వరుణ్ ధావన్ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే వరుణ్ ధావన్ పెళ్లి వేడుకలో ఒక ఆసక్తికర ఘటన జరిగినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 వరుణ్ ధావన్, నటాషా పెళ్లి వేడుకలో పాల్గొన్న సిబ్బంది వీడియోలు, ఫోటోలు ఇలాంటివి తీయకుండా కఠిన ఆంక్షలు విధించినట్లు  తెలుస్తుంది. ఏకంగా సిబ్బంది ఫోన్ కెమెరాలకు స్టిక్కర్లు అతికించారట. ఒకవేళ ఇక అక్కడ  ఉన్న  రూల్స్ అతిక్రమించి  ఎవరైనా సిబ్బంది ఇక కెమెరాలకు ఉన్న స్టిక్కర్లు తీసివేస్తే వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం వెళ్లే విధంగా ఏర్పాటుచేశారట. అలా చేస్తే చర్యలు తీసుకున్నారట. ఈ క్రమంలోనే వరుణ్ ధావన్ పెళ్లిలో సిబ్బంది ఫోన్ కెమెలకు రా స్టిక్కర్లు వేయడంతో ఎవరూ కూడా ఇక ఫొటోలు తీసేందుకు సాహసం చేయలేదట. ఇక ఈ విషయం బయటకు రావడంతో ప్రస్తుతం నెటిజన్లు వరుణ్ ధావన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: