శృతిహాసన్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. తను కమల హాసన్ కూతురు అయినప్పటికీ, తండ్రి బ్యాగ్రౌండ్ ను ఏమాత్రం ఉపయోగించుకోకుండా తన సొంత నటనతో, అభినయంతో, ఆహార్యం తో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుని,స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి ఎదిగింది. ఇదిలా ఉండగా ఈమె క్రాక్ సినిమా ద్వారా తన  సెకండ్ ఇన్నింగ్స్ ని సినీ కెరీర్ లో బాగానే స్టార్ట్ చేసింది.


క్రాక్ సినిమా ద్వారా సంక్రాంతి కానుకగా వచ్చి, ప్రేక్షకులు అందరిని మెప్పించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించడం గమనార్హం. ఇక అంతే కాకుండా త్వరలో మూడవ సారి పవన్ కళ్యాణ్ తో జత కట్టడానికి రెడీ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతోంది. ఇక అదే విధంగా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించబోతున్న సలార్ సినిమాలో కూడా అవకాశం కొట్టేసింది ఈ అమ్మడు..

ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ ద్వారా మన టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆమె ఏమనుకుంటుందో వివరించింది. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. "అల్లు అర్జున్ కి వృత్తి పట్ల చాలా అంకితభావం ఉంది. అవసరమైన దానికంటే ఎక్కువ కష్టపడతాడు. కష్టపడే గుణం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక మహేష్ బాబు అయితే ఎప్పుడు ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటాడు. ఆయనతో స్క్రీన్ పంచుకోవడం నా అదృష్టం అని చెప్పవచ్చు."

ఇక రవితేజ గురించి మాట్లాడితూ.. "నాకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి రవితేజ.. నా కెరియర్ ప్రారంభంలో బలుపు సినిమా కోసం ఆయనతో పనిచేసిన ఆ సమయంలో చాలా సపోర్ట్ చేశారు. సీనియర్ నటుడు అనే ఫీలింగ్ కూడా లేకుండా చాలా సౌకర్యవంతంగా అనిపించేవాడు. సీనియర్ నటుడు అయినప్పటికీ అందరిలోనూ బాగా కలిసిపోయే గుణం కలవాడు. ఆయనకు నా మనసులో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది అని చెప్పింది శృతి హాసన్.

మరింత సమాచారం తెలుసుకోండి: