రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్ తో ‘డాడీ’వంటి సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం శర్వానంద్తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, తమిళంలో కార్తీతో ‘సుల్తాన్’ ఇంటి భారీ ప్రాజెక్టులలో రష్మిక మందన ప్రేక్షకులను మెప్పించే టానికి సిద్ధమవుతోంది.
ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ లో సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్పం’లో రష్మిక హీరోయిన్గా ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తి అవ్వకముందే మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. దిల్ రాజు నిర్మాతగా మెగా హీరో రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు అందులో హీరోయిన్ గా బ్యూటీ క్వీన్ రష్మిక మందనకు అవకాశం దక్కించుకొని మరో పాన్ ఇండియా మూవీలో నటించడానికి సిద్ధం సిద్ధమైంది. రష్మిక మందాన నిర్మాతల పాలిట లక్కీ హీరోయిన్ కావడంతో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా తన అందం, అభినయంతో దూసుకుపోతుంది