ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్  హీరోయిన్ గా పాన్ ఇండియా మూవీస్ లో దూసుకుపోతున్న శాండిల్ వుడ్ హీరోయిన్ రష్మిక మందన. నాగ శౌర్య హీరోగా నటించిన "చలో" మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తర్వాత వచ్చిన గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌ , సరిలేరు నీకెవ్వరు , భీష్మ ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లో నటించి అగ్ర కథానాయిక వెలుగొందుతుంది. రష్మిక సినీ జీవితం మోల్డింగ్ ద్వార ప్రారంభమై తన అద్భుతమైన ప్రతిభతో మొదట " కిరిక్ పార్టి" అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో అద్భుతంగా నటించడంతో తరువాత ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన "అంజని పుత్ర" మూవీ, గణేశ్ సరసన "ఛమక్' అనే కన్నడ చిత్రాలలో నటించింది. అంచలంచలుగా తన ప్రతిభను చాటుకుంటూనే సౌత్ ఇండియా మూవీస్ లో అగ్ర కథానాయికగా వెలుగొందుతుంది.

రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్లో  సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘మిషన్‌ మజ్ను’, అమితాబ్‌ బచ్చన్‌ తో ‘డాడీ’వంటి సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం శర్వానంద్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, తమిళంలో కార్తీతో ‘సుల్తాన్‌’ ఇంటి భారీ ప్రాజెక్టులలో రష్మిక మందన ప్రేక్షకులను మెప్పించే టానికి సిద్ధమవుతోంది.
 
ఇలా ఉండగా ప్రస్తుతం టాలీవుడ్ లో సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న పాన్‌ ఇండియా మూవీ ‘పుష్పం’లో  రష్మిక హీరోయిన్‌గా ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తి అవ్వకముందే మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. దిల్ రాజు  నిర్మాతగా మెగా హీరో రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నారు అందులో హీరోయిన్ గా బ్యూటీ క్వీన్ రష్మిక మందనకు అవకాశం దక్కించుకొని మరో పాన్ ఇండియా మూవీలో నటించడానికి సిద్ధం సిద్ధమైంది. రష్మిక మందాన నిర్మాతల పాలిట లక్కీ హీరోయిన్ కావడంతో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా తన అందం, అభినయంతో దూసుకుపోతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: