మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్
సినిమా సర్కారు వారి పాట పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్
ఆడియన్స్ లో కూడా సూపర్ గా అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల వరుసగా చేస్తున్న సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్న
సూపర్ స్టార్, ఈ
మూవీ తో కూడా మరొక
సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్లు టాక్.
పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లో
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా
యువ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్
థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మది ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ
మూవీ ని 14 రీల్స్ ప్లస్, మైత్రి
మూవీ మేకర్స్,
జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు అత్యంత భారీగా గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాయి. ఇక దీని తరువాత
మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు
రాజమౌళి దర్శకత్వంలో ఒక
సినిమా చేయనున్నారు అనే విషయం తెలిసిందే. ఇటీవల ఈ విషయమై
రాజమౌళి కూడా స్వయంగా ప్రకటన చేసారు. అయితే ప్రస్తుతం
రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ విషయమై బిజీగా ఉండడం, అలానే అది పూర్తి అవడానికి ఇంకా చాలా సమయం ఉండడంతో, ఈలోపు మరొక సినిమాని కూడా చేసేలా
సూపర్ స్టార్ మహేష్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు.
ఇక ఇటీవల సర్కారు వారి పాట
మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని
దుబాయ్ లో పూర్తి చేసి
హైదరాబాద్ తిరిగొచ్చిన
మహేష్, ప్రస్తుతం పలువురు దర్శకుల వద్ద కథలు వింటున్నట్లు టాక్. మరోవైపు
మహేష్ తో ఒక్క
సినిమా ఛాన్స్ వస్తే చాలు వీలైనంత త్వరగా దానిని పూర్తి చేసి రిలీజ్ చెసాలా పలువురు దర్శకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా
మహేష్ తో నెక్స్ట్
సినిమా చేసే దర్శకుల్లో ప్రముఖంగా
వెంకీ కుడుముల,
అనిల్ రావిపూడి,
వంశీ పైడిపల్లి,
లోకేష్ కనకరాజ్ ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ప్రస్తుతం బంతి
మహేష్ కోర్ట్ లో ఉండడంతో ఆయన తన తదుపరి
మూవీ ఛాన్స్ ఎవరికి ఇస్తారో తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.....!!