తెలుగు చిత్రపరిశ్రమలో నార్త్ ఇండియా భామలు హల్ చల్ చేసేవాళ్ళు అది ఒక్కపుడు మాత్రమే. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కన్నడ భామలు హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కన్నడ భామల హంగామానే కొనసాగుతుంది. ఇక ప్రజెంట్ హాట్ టాపిక్ అయిన కన్నడ హీరోయిన్ కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాలో అందంతో పాటు తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది ఈముద్దుగుమ్మ. ఇక నాని సినిమాలో ఛాన్స్‌తో పాటు మరికొన్ని సినిమాల ఆఫర్లతో బిజీ అయిపోయింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది మరో కన్నడ బ్యూటీ నభా నటేష్. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ కన్నడ చిన్నది.డిస్కోరాజా, సోలోబ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుని ప్రస్తుతం నితిన్ ‘అంధాదూన్’ రీమేక్‌లో నటిస్తోంది.

ఇక ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది రష్మిక మందన. ఈ భామ ఫస్ట్ సినిమాలోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘గీతగోవిందం’ హిట్‌తో రష్మిక స్టార్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది. తర్వాత నితిన్, మహేష్, అల్లు అర్జున్.. ఇలా వరుస సినిమాలతో బిజీ అయిపోయింది రష్మిక. ప్రజెంట్ బన్నీతో ‘పుష్ప’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది రష్మిక.

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా టాప్ రేంజ్‌లో ఉన్న పూజా హెగ్డే రూట్స్ మాత్రం కర్ణాటకలోనే. ‘మహర్షి’ తో పాటు ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అకౌంట్‌లో వేసుకున్న పూజా., ఇప్పుడు ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాతో పాటు.. రామ్ చరణ్‌తో ‘ఆచార్య’ ఆడపాడనుంది. ఆల్రెడీ సూపర్ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నఈ కన్నడ హీరోయిన్స్‌తో పాటు.. రచితా రామ్ అనే మరో బ్యూటీ ‘సూపర్ మచ్చి’ సినిమాతో కొత్తగా ఎంట్రీ ఇస్తోంది. అలనాటి పెళ్లి సందడికి సీక్వెల్‌గా వస్తున్న ‘పెళ్లిసందడి’ సినిమాలో శ్రీలీల అనే మరో కన్నడ హీరోయిన్ తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. ఇలా కన్నడ హీరోయిన్స్ తెలుగు స్క్రీన్‌ని ఫుల్‌గా ఆక్యుపై చేసుకుంటున్నారనే చెప్పాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: