సాహో సినిమా తర్వాత చాలా విరామం తీసుకోని రాధేశ్యామ్ వంటి పీరియాడిక్ లవ్ స్టోరీతో రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడు. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. ఎందుకంటే, బాలీవుడ్ లో ఒక్కసారి లవ్ స్టోరీకి హీరో కనెక్ట్ అయితే, అక్కడ స్టార్ అయిపోతాడు. అప్పట్లో సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ , అలాగే అనిల్ కపూర్, షాహిద్ కపూర్, రిషి కపూర్ ఇలా అందరూ కూడా లవ్ స్టోరీలతోనే స్టార్ హీరోలు అయ్యారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్ స్టార్స్ ని కలవరపరుస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే ప్రభాస్ మార్కెట్ ని ఎవ్వరూ ఊహించలేరు. ఒక రేంజ్ లో ఉంటుంది.
ఇక రాధేశ్యామ్ మూవీ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తీస్తున్న ఫుల్ యాక్షన్ సినిమా సలార్ అయితే దడపుట్టించేస్తోంది. ఎందుకంటే, ఆల్రెడీ కేజీఎఫ్ కి బాలీవుడ్ లో భారీ డిమాండ్ ఉంది. అదే సినిమా డైరెక్టర్ అందులోనూ ప్రభాస్ తో చేస్తున్న యాక్షన్ సినిమా కాబట్టి బాలీవుడ్ కి చెమటలు పట్టేస్తున్నాయి. లవ్ స్టోరీ తర్వాత వచ్చే యాక్షన్ సినిమా హిట్ అయితే మార్కెట్ మామూలుగా ఉండదు. అక్కడ ప్రభాస్ చించి ఆరేస్తాడు అంతే. అందుకే, ముందుగానే ప్రభాస్ మార్కెట్ ని ఊహించి మరీ ఓంరౌత్ మైథలాజికల్ మూవీకి రెడీ అయ్యాడు. ఆది పురుష్ సినిమా కూడా మంచి టాక్ వచ్చిందంటే ప్రభాస్ కి అక్కడ పూజలు చేసేస్తారు నో డౌట్. రాముడిగా ఒక్కసారి అక్కడ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు అంటే ఇంక వేరే హీరోలు ఎవ్వరూ గుర్తుకు రారు. ప్రభాస్ పేరు బాలీవుడ్ నలు మూలలా మారుమోగిపోతుంది.ఇక నాగ్ అశ్విన్ తో చేసే సినిమా కూడా ఒక రేంజిలో వుంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలతో బాలీవుడ్ స్టార్ హీరోస్ కి ఇప్పటినుంచే చెమటలు పట్టిస్తున్నాడు ప్రభాస్...