టాలీవుడ్
సినిమా పరిశ్రమకు నిజంగా మంచి రోజులు వచ్చినట్లుగానే కనపడుతోంది. కోవిడ్ మహమ్మారి వలన విధించబడిన లాక్ డౌన్ తరువాత విడుదలైన సినిమాల్లో చాలావరకు ప్రస్తుతం మంచి
సక్సెస్ రేట్ తో కొనసాగుతుండడం విశేషం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక గత నెలలో మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రేమకథా
సినిమా ఉప్పెన.
వైష్ణవ్, కృతి ఇద్దరూ కూడా తొలిసారిగా నటిస్తున్నప్పటికీ కూడా ఎంతో అనుభవం ఉన్నవారి మాదిరిగా ఎంతో అద్భుతంగా నటించారని, విలన్ గా
విజయ్ సేతుపతి వండర్ఫుల్ పెర్ఫార్మన్స్, రాక్ స్టార్ దేవిశ్రీ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మైత్రి
మూవీ మేకర్స్ వారి భారీ నిర్మాణ విలువలు, మరీ ముఖ్యంగా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా సినిమాని తీసిన దర్శకుడు బుచ్చి బాబు
సనా ఇలా అందరూ కూడా ఈ
మూవీ సక్సెస్ కి కారణంగా నిలిచారని, ఈ సందర్భంగా వారితో పాటు మిగతా యూనిట్ సభ్యులు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందలు తెలుపుతున్నట్లు పోస్టులు పెట్టారు అల్లు అర్జున్. ఇక ప్రస్తుతం అవి సోషల్
మీడియా లో ఎంతో వైరల్ అవుతున్నాయి.....!!