భారత దేశంలో హిందీ తరువాత అతి పెద్ద చిత్ర పరిశ్రమలైన టాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమలు ఎప్పటికప్పుడు మంచి విజయవంతమైన సినిమాలతో భారీ సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నాయి. నిజానికి అటు కన్నడ, మలయాళం లో కూడా ఇటీవల ఎన్నో మంచి సినిమాలు వస్తూ బాగానే వసూళ్లు అందుకుంటున్నాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక ప్రత్యేకంగా మన టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటే, కరోనా మహమ్మారి తరువాత మెల్లగా కోలుకున్న చిత్ర పరిశ్రమ ఒక్కొక్కటిగా సినిమాలు విడుదల చేస్తూ వస్తోంది.

ముందుగా సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ తో ప్రారంభం అయిన సక్సెస్ లు ఇటీవల వచ్చిన నాంది మూవీ వరకు కొనసాగాయి. అలానే అతి త్వరలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మరికొన్ని రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. అయితే వీటిలో ముఖ్య విషయం ఏమిటంటే, ఇటీవల సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం ఎక్కువ అయిన తరువాత సినిమాల యొక్క అప్ డేట్స్ ముందుగా వాటి ద్వారానే ఆడియన్స్ కి రీచ్ అవుతుండగా మరోవైపు పలువురు స్టార్ హీరోలు సైతం కొన్ని సినిమాలకు తమవంతుగా మాట సహాయం అందించడం తో పాటు సాంగ్స్, టీజర్, ట్రైలర్ వంటివి రిలీజ్ చేస్తూ కొంత వరకు పబ్లిసిటీ చేస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. 

ఇటీవల కొన్నాళ్ల క్రితం నుండి ఈ విధమైన సినిమాల ప్రచారం ఒకింత ఎక్కువైందని, ఒకరకంగా ఇది ఎంతో మంచి ఆరోగ్యకరమైన విధానం అని, ఎందుకంటే స్టార్ హీరోలు కనుక ఒక చిన్న సినిమాకి తమ వంతు మాట సాయం చేస్తే తప్పకుండా అది దానికి కొంతవరకు అయినా సహాయకారిగా నిలిచే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అలానే దీనిని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఒక స్టార్ హీరో సినిమాలకు సంబందించిన అప్ డేట్స్ మరొక స్టార్ హీరో లేదా హీరోయిన్ తో రిలీజ్ చేయించే ఛాన్స్ లు కూడా ఉన్నాయని,  ఆ విధంగా టాలీవుడ్ మరింతగా వెలిగిపోయే రోజులు త్వరగా వస్తే బాగుంటుందని పలువురు ఆడియన్స్ అభిప్రాయపడుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: