తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్ గా  మారింది పూజా హెగ్డే. అటు కేవలం తెలుగులోనే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పటికే తెలుగులో అగ్రహీరోల సరసన నటిస్తున్న పూజా.. తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కోట్టేసింది. అతనేవరో కాదండోయ్ తమిళ స్టార్ హీరో విజయ్.అయితే పూజాకు ఇంతవరకు తమిళ్ లో సరైన బ్రేక్ రాలేదు. కానీ ఈసారి స్టార్ హీరో సరసన ఛాన్స్ వచ్చేసరికి ఈ అమ్మడు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం పూజా హెగ్డె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు జోడీగా రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ బుట్టబోమ్మ. ఇవే కాకుండా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇక తమిళ్ స్టార్ హీరో విజయ్ 65వ సినిమాలో ఈ అమ్మడు ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా కోసం ముందుగా రష్మిక మందన అనుకున్నట్లుగా వార్తలు వచ్చిన.. ఫైనల్ గా పూజాహెగ్డేను సెలక్ట్ చేసుకున్నారట మేకర్స్. అయితే ఈ సినిమా కోసం బుట్టబోమ్మ భారీగానే పారితోషకం తీసుకుంటుందట. దాదాపు రూ.3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం.

ఇందుకు కారణం లేకపోలేదు.. ఇప్పటికే పూజా హెగ్డే వరుసగా పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తుండడంతో ఇంతలా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా టాక్. ఇక విజయ్ 65వ సినిమాను తమిళ డైరెక్టర నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా.. యవ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. భారీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే పూజా హెగ్డే ఇప్పుడే ఇంతలా డిమాండ్ చేస్తే.. ప్రభాస్ తో సరసన నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ విడుదల తర్వాత మరింత రెమ్యూనరేషన్ పెంచనున్నట్లుగా ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: