కొన్ని సినిమాల్లో కేవలం ఐటమ్ సాంగ్స్ లోనూ తళుక్కుమన్నారు. తన దరికి ఏ పాత్ర చేరినా, కాదనేవారు కాదు. మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ తో నాయికగానూ నటించారు. వారి చిత్రాలలో నర్తనంతోనూ మురిపించారు. యన్టీఆర్ తో "పెంకిపెళ్ళాం, రాజమకుటం, వాల్మీకి, బభ్రువాహన, ఆప్తమిత్రులు" వంటి చిత్రాలలోనూ, ఏయన్నార్ జంటగా "శాంతినివాసం, శభాష్ రాజా, ఇద్దరు మిత్రులు" వంటి సినిమాల్లోనూ నటించారు. ఆ సినిమాలు నాయికగా రాజసులోచనకు మంచి పేరే సంపాదించిపెట్టాయి.
యన్టీఆర్ చెల్లెలుగా రాజసులోచన నటించిన 'మంచిమనసుకు మంచిరోజులు' చిత్రం అనూహ్య విజయం సాధించింది. అయినప్పటికీ నిర్మాతలు, దర్శకులు తనకు ఇచ్చిన పాత్రల్లో నటించడానికి ఆమె ఏ నాడూ వెనుకాడలేదు. అలా తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు..ఇక ఆమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే...ప్రముఖ దర్శకుడు, నటుడు సి.ఎస్.రావును వివాహమాడారు రాజసులోచన. సి.ఎస్.రావు దర్శకత్వంలో రూపొందిన పలు చిత్రాలలో రాజసులోచన కీలక పాత్రలు పోషించారు. వారికి ఇద్దరు కవల అమ్మాయిలు జన్మించారు. వారిలో ఒకరు అమెరికాలోనూ, మరొకరు చెన్నైలోనూ స్థిరపడ్డారు. 2013 మార్చి 5న తన 77వ యేట కన్నుమూశారు రాజసులోచన..అయినా కూడా అప్పటి తన అందచందాలతో, నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు...!!