కన్నడ బ్యూటీ రష్మిక మందాన ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది.. ఛలో సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమా తోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ భామ కి ఇప్పుడు భారీ ప్రాజెక్ట్ లుచేతిలో ఉన్నాయి. ఆమె నటించిన రెండో సినిమా గీత గోవిందం తో రెండో సూపర్ హిట్ అందుకుంది..ఈ చిత్రంలో టాలీవుడ్ లోని అందరి కళ్ళు ఈ కన్నడ భామపై పడ్డాయి.. ఈ విజయం తో ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అయిపొయింది..

టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది..కార్తీ సుల్తాన్ సినిమా లో ఆమె నటించింది.. ఆ సినిమా తో తమిళ ప్రేక్షకుల మెప్పును పొందగా ఆమెకు మరిన్ని ఛాన్స్ లు రావడం మొదలు పెట్టాయట..టాలీవుడ్ లో ఛలో సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి రెండో సినిమా గీత గోవిందం తో సూపర్ హిట్ అందుకుంది.. అంతేకాదు త్వరలో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది.. అక్కడ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా సినిమా తో ఎంట్రీ ఇస్తుంది రష్మిక..

తాజాగా ఈ కూర్గ్ బ్యూటీ కి బంపర్ ఆఫర్ దక్కింది. రామ్ చరణ్ శంకర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె జర్నలిస్ల్‌గా కనిపించనుందట.ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుంది రష్మిక.. అది సినిమా రిలీజ్ అయితే ఆమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నెంబర్ వన్ గా ఎదగడం ఖాయం. ఇప్పుడు ఈ సినిమా తో ఆమె పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయిపోతుంది.. మరీ రష్మిక ను ఆపడం ఎవరితరం కాదేమో..  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా తో సూపర్ హిట్ కొట్టింది.. భీష్మ కూడా హిట్ అయ్యి తనకు మంచి పేరు రావడంతో ఆమెకు మంచి మంచి అవకాశాలు రావడం ప్రారంభమయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: