మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మాణంలో రూపొందిన వినయ విధేయ రామ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తొలిసారిగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఆ అంచనాలకు ఏమాత్రం అందుకోలేక వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

అయితే దాని తర్వాత ఎన్టీఆర్ తో కలిసి ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. పేట్రియాటిక్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. ఈ మూవీపై మనదేశంతో పాటు ఇతర దేశాల ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే దీని తర్వాత ప్రఖ్యాత దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయనున్నారు.

ఇటీవల దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది. అయితే ఈ సినిమా గతంలో శంకర్, అర్జున్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఒకే ఒక్కడు సినిమాకి రీమేక్ గా రూపొందుతుంది అంటూ కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. కాగా అవేవీ నిజం కాదు చరణ్ తో శంకర్ తీయబోయేది ఫ్రెష్ స్టోరీ సినిమా అని ఇప్పటికే ఆ మూవీ యొక్క స్టోరీ, స్క్రిప్ట్ ని శంకర్ ఎంతో అద్భుతంగా సిద్ధం చేసుకున్నారని అలాగే అతి త్వరలో దాని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయని యూనిట్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే అతి త్వరలో దీనికి సంబంధించి అధికారికంగా షూటింగ్ విషయాలు కూడా వెల్లడి కానున్నట్లు చెప్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: