సౌత్ ఇండియా సంచలన దర్శకుడు శంకర్ కి ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా మంచి పేరు వుంది. ప్రతి సినిమా ప్రయోగాత్మకంగా ఉంటుంది. ప్రతి హీరోతో ప్రయోగాలు చెయ్యాలని శంకర్ కోరుకుంటాడు.ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది అంటున్నారు. దిల్‌ రాజు 50వ చిత్రంగా చెర్రీకి 15 వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా చరిత్రలో నిలిచేపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట శంకర్.ఇక ఈ సినిమా కథ ఇది, రామ్‌చరణ్‌ పాత్ర ఇది అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. అయితే వేటిలోనూ క్లారిటీ లేదు. తాజాగా ఈ సినిమాలో చరణ్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తాడని వార్తలొస్తున్నాయి. అందులో ఒకటి 50ఏళ్లు పైబడిన వ్యక్తి అని సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతోంది.దీంతోపాటు ఇప్పుడు మరో మాట కూడా వినిపిస్తోంది.


ఇక ఈ సినిమా తండ్రీ, కొడుకుల కథ అని చాలా రోజుల నుండి వినిపిస్తోంది.ఇందులో తండ్రి పాత్ర కోసం సీనియర్‌ నటుణ్ని చూద్దాం అనుకున్నారట శంకర్‌. అయితే ఆ పాత్ర కూడా నేనే చేస్తా అంటూ రామ్‌చరణ్‌ ముందుకొచ్చాడట. ప్రతిష్ఠాత్మక సినిమాలో ఇలాంటి డేరింగ్‌ స్టెప్‌ అవసరమా అనుకున్నాడో, లేక ఇంకేదైనా డౌట్‌ ఉందో… శంకర్‌ వేరే ఆలోచన చేస్తున్నారట. సీనియర్‌ చరణ్‌ పాత్ర కోసం త్వరలో రామ్‌చరణ్‌కు గెటప్‌ టెస్ట్‌ చేస్తారట. ఇందులో చరణ్‌ పాస్‌ అయితేనే సినిమాలో డ్యూయల్‌ రోల్‌ ఉంటుందంటున్నారు.అన్నీ కుదిరితే ఈ జూన్‌, జులైలో సినిమా చిత్రీకరణ మొదలుపెడతారని ఆ మధ్య వార్తలొచ్చాయి. తీరా ఇప్పుడు చూస్తే కరోనా సెకండ్‌ వేవ్‌ దారుణంగా ప్రభావం చూపిస్తోంది. దాంతో ఈ సినిమా చాలా లేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాకు దిల్‌ రాజు ₹150 కోట్ల బడ్జెట్‌ ఫిక్స్‌ చేశాడని కూడా అంటున్నారు. అయితే ఆ బడ్జెట్ శంకర్‌ సినిమాకు చాలా తక్కువ అనే మాటలూ వినిపిస్తున్నాయి.ఈ విషయంలో శంకర్ కూడా కొంచెం అసంతృప్తిగా వున్నాడట. చూడాలి చివరికి ఏమవుతుందో ఏమో...!

మరింత సమాచారం తెలుసుకోండి: