ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టాలీవుడ్ లో పరిచయం అవుతుంది.. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న పాన్ అంటే సినిమాల్లో క్రేజీ ఫిల్మ్ గా ఈ సినిమా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.. విజయ్ దేవరకొండ కూడా గత రెండు చిత్రాలు నిరాశ పరచడంతో ఈ సినిమా తో మంచి హిట్ కొట్టి అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది..
ఇక పూరి జగన్నాథ్ సినిమా లో హీరో పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. హీరోయిన్ పాత్ర ను కూడా చక్కగా డిజైన్ చేసే సత్తా ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్.. అలా ఆయన నుంచి మొత్తం 21 మంది హీరోయిన్లు పరిచయమయ్యారు టాలీవుడ్ కి.. మరి వారు ఎవరంటే.. అమీషా పటేల్, రేణుదేశాయ్, అనుష్క శెట్టి, హన్సిక మొత్వాని, రక్షిత , అసిన్, అయేషా టకియా, నేహా శర్మ, అదితి ఆర్య, ఆదా శర్మ , కంగనారనౌత్, ముస్కాన్, తను రాయ్, సమీక్ష , దియా, దిశా పటాని, క్యాథరిన్, అనన్య పాండే, మన్నారా చోప్రా.. వంటి వారిని పరిచయం చేశాడు పూరీ..