టాలీవుడ్ కమెడియన్ కం ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తొలిసారిగా నిర్మాతగా రూపొందించిన సినిమా ఆంజనేయులు. యువ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా నయనతార హీరోయిన్ గా నటించింది. 2009 లో మంచి అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ తో తీన్మార్ సినిమా రూపొందించిన బండ్ల గణేష్ దానితో ఫ్లాప్ ను చవి చూశారు.

అయితే దాని అనంతరం దారి మరొకసారి పవర్ స్టార్ తో సినిమా నిర్మించే ఛాన్స్ దక్కించుకున్న బండ్ల ఆయనతో నిర్మించిన గబ్బర్ సింగ్ తో పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన గబ్బర్ సింగ్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ సినిమా తర్వాత హీరోగా పవర్ స్టార్ ఇమేజ్, మార్కెట్ మరింతగా పెరిగాయి అని చెప్పక తప్పదు. ఇక దాని అనంతరం ఎన్టీఆర్ తో బాద్షా వంటి హిట్ సినిమా తర్వాత బండ్ల గణేష్ అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో సినిమా తీశారు, అయితే అది మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆపై రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే సినిమా మూవీ నిర్మించినా అది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.

అనంతరం మరోసారి ఎన్టీఆర్ తో బండ్ల నిర్మించిన సినిమా టెంపర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుని నిర్మాతగా బండ్ల గణేష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక లేటెస్ట్ గా పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలో తన టాలీవుడ్ దేవుడైన పవర్ స్టార్ తో బండ్ల గణేష్ ఒక సినిమా నిర్మించనున్నారని అంటున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య ఒక సినిమా ఒప్పందం జరిగిందని టాలీవుడ్ కి చెందిన ఒక స్టార్ డైరెక్టర్ పవన్ కోసం ప్రస్తతం ఒక అద్భుతమైన స్టోరీ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కి వరుసగా కమిట్మెంట్స్ ఉండటంతో అవి పూర్తయిన వెంటనే బండ్ల మూవీ ఉంటుందని టాక్. అయితే దీనిపై అధికారిక న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: