టాలీవుడ్ ప్రేక్షకులకు బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వాని సుపరిచయమే. తెలుగులో ఈమె చేసిన డెబ్యూ సినిమా ఛాన్స్ ఈ హీరోయిన్ కి దక్కలేదనే చెప్పాలి.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని తొలి సినిమాతోనే పొందింది కీయారా.. బాలీవుడ్ లో ఓ మోస్తారు హీరోయిన్ గా ఉన్న కియార తెలుగులో చేసిన తర్వాత తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ అయిపోయింది.. ఇక ఆమె రెండో సినిమానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన చేసింది..


అయితే ఆ సినిమా ఫ్లాప్ కావడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు ఎక్కువగా రాలేదు..బోయపాటి శ్రీను  దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వినయ విధేయ రామ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది.. తొలి సినిమా హిట్ అయినా రెండో సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. దాంతో మళ్లీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమనే నమ్ముకుంది కియారా.. అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ, మంచి నటిగా గుర్తింపు పెంచుకుంటూ బిజీగా ఉంటుంది.. త్వరలో తన తెలుగు రీ ఎంట్రీ కూడా ఉండబోతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం అంతట ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది..

ఆమె తెలుగులో రీ ఎంట్రీ సినిమాలో భాగం గా రామ్ చరణ్ తేజ్, శంకర్  కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్టు లో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది .. అయితే ఈ సినిమా కోసం ఆమె భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతుందట.. దాదాపుగా రెండున్నర కోట్ల పారితోషికం కావాలని ఆమె డిమాండ్ చేయగా,  దానికి సదరు నిర్మాత ఆలోచించి వేరే హీరోయిన్ ను తీసుకోవాలని భావిస్తున్నారట.. మరి కియారా వచ్చిన మంచి అవకాశాన్ని రెమ్యునరేషన్ రూపంలో పోగొట్టుకుంటుందా లేదా కాంప్రమైజ్ అయ్యి మరిన్ని అవకాశాలు తెలుగులో రాబట్టుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: