మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో వంటి సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ తో ఆయన తన తదుపరి సినిమా చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన రావడం జరిగింది.

సినిమా టైటిల్ పార్ధు అని అలానే ఈ మూవీలో అక్కినేని సుమంత్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు అంటూ కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఏ విధమైన జానర్లో తెరకెక్కుతుంది అనే దానిపై మాత్రం అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. కొందరేమో ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని, మరికొందరేమో ఇది యాక్షన్ తో కూడిన ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కుతోందని, అలానే ఇంకొందరైతే ఇది పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని వార్తలు ప్రచారం చేస్తున్నారు.

అయితే పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం త్రివిక్రమ్ మరొకసారి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ జానర్ ని ఎంచుకున్నారని అంటున్నారు. ఒక రకంగా సేఫ్ జానర్  గా చెప్పబడే ఈ జానర్లో గతంలో త్రివిక్రమ్ పలు విజయాలు అందుకున్నారు. ఇక మహేష్ తో చాలా ఏళ్ళ తరువాత చేస్తున్న సినిమా కావడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని త్రివిక్రమ్ మరొకసారి ఈ సేఫ్ జానర్ కె ఓటేశారని అలానే ఈ మూవీ భారీ హిట్ కొట్టేలా ప్రస్తుతం తన బృందంతో కలిసి స్క్రిప్టుని మరింత అద్భుతంగా తయారు చేయడంలో త్రివిక్రమ్ నిమగ్నమై ఉన్నారని చెబుతున్నారు. ఈ సినిమా జులై చివరి వారంలో సెట్స్ మీదకు వెళ్లనుండగా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయనున్నారు.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: