సినిమా సెల‌బ్రిటీల‌కు సంబంధించి ఏ విషయం అయినా ప్ర‌త్యేక‌మ‌నే చెప్పాలి. ఇక వారి గ‌తంలో దిగిన ఫొటోలు కంట ప‌డితే చాలు దాన్ని సోష‌ల్‌మీడియాలో ట్రెండ్ చేయ‌డం చాలా కామన్‌. ఇక ఇద్ద‌రు ముగ్గురు హీరోలు క‌లిసి ఫొటో దిగితే గ‌న‌క దాని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈజీగా వైర‌ల్ అయిపోతోంది. అలాంటి ఫొటోలు ఇప్పుడు అనేకం సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. హీరోయిన్ల చిన్న‌నాటి ఫొటోలు, హీరోల చిన్నప్ప‌టి పొటోలు క‌నిపిస్తున్నాయి.

ఇక ఈ క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇలాంటి రేర్ పిక్స్ అనేకం క‌నిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మ‌న తెలుగు హీరోల‌కు సంబంధించిన ఫొటోలు చెక్క‌ర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఫొటోనే తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అయితే ఇది మ‌రింత రేర్ పిక్ అనే చెప్పాలి. న‌లుగురు లెజండ‌రీ హీరోలు ఒకే వేదిక‌పై ఉన్న ఆ ఫొటో వైర‌ల్ అవుతుంది. దాదాపు 33 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా న‌టించిన విజయ బాపినీడు డైరెక్ష‌న్ లో వ‌చ్చిన మూవీ ఖైదీ నెం.786.

అప్ప‌ట్లో ఈ మూవీ విడుద‌లై పెద్ద సంచ‌ల‌న విజయం సాధించింది. దీంతో ఆ సినిమా సక్సెస్ వేడుకను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో విజయ బాపినీడుతో పాటు చిరంజీవిలను అభినందించేందుకు పెద్ద హీరోలైన కృష్ణ‌, కృష్ణంరాజు, శోభ‌న్ బాబు ఆ ప్రోగ్రామ్‌కు వ‌చ్చి హంగామా చేశారు. ఆ కాలంలో డైరెక్ట‌ర్ విజ‌య బాపినీడుకు స్టార్ హీరోలు కృష్ణ‌, కృష్ణంరాజు, శోభ‌న్ బాబుల‌తో మంచి సంబంధాలు ఉండేవి.

ఈ కార‌ణంగా ఈ ముగ్గురు స్టార్ హీరోలు పిల‌వ‌గానే చిరంజీవి ప్రోగ్రామ్‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే అప్పుడు వీరంతా క‌లిసి ఒకే వేదిక‌పై దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. 1988 జూన్ 10న రిలీజ్ అయిన ఖైదీ నెం.786 మూవీ పెద్ద స‌క్సెస్ సాధించింది. ఇందులో భానుప్రియ హీరోయిన్ గా న‌టించి మెప్పించింది. మోహన్ బాబుతో పాటు కోట శ్రీనివాసరావు లాంటివాళ్లు కీల‌క పాత్ర‌లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: