సినీ ఇండస్ట్రీలో అదృష్టవశాత్తు హీరో, హీరోయిన్లు ఓవర్ నైట్ కే స్టార్ డమ్ ను సంపాదిస్తుంటారు. మరి కొంత మంది నటులు అడపాదడపా సినిమాలు చేస్తూ కనిపించకుండాపోయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో గాయత్రి కూడా ఒకరు. అయితే ఈమె  ఇప్పుడు ఏం చేస్తుంది ? ఎలా ఉందో? తెలుసుకుందాం.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెలుగులో  వచ్చిన "హ్యాపీ డేస్" సినిమా గురించి అందరికీ తెలిసిందే. అందులో నటిగా అపర్ణ పాత్రలో నిఖిల్ కి జోడీగా గాయత్రి రావు నటించింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి మార్కులు పడ్డాయనే చెప్పవచ్చు. ఇక ఈమె తల్లి పద్మ కూడా పలు చిత్రాలలో అందరికీ సుపరిచితురాలే. మొదట ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది , సుమంత్ హీరోగా నటించిన మధుమాసం, బాలకృష్ణ హీరోగా నటించిన సుల్తాన్, భూమిక లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో తెరకెక్కిన మిస్సమ్మ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అంతేకాదు తన కూతురు గాయత్రి రావు నటించిన హ్యాపీ డేస్ సినిమా లో కూడా గెస్ట్ రోల్ చేసింది పద్మ.

ఇక పద్మ ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ , ప్రేక్షక ఆదరణ పొందకపోవడంతో ఇక సీరియల్స్ లోకి అడుగు పెట్టి, అక్కడే స్థిరపడి పోయింది. ఇక ఈమె కూడా హ్యాపీ డేస్, గబ్బర్ సింగ్ , ఆరెంజ్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా అపర్ణ గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ పక్కన హారతి పాత్రలో నటించి అందర్నీ నేర్పించింది. ఇక పవన్ కళ్యాణ్ - హారతి, బ్రహ్మానందం - హారతి ల మధ్య సాగే సన్నివేశాలు ప్రేక్షకులను  కడుపుబ్బా నవ్వించాయి. చాలా వరకు ఈమె నటించిన పాత్రలన్నీ చాలా డీసెంట్ గా ఉండడంతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించాయి. కానీ అనుకున్న  స్థాయిలో సినిమా అవకాశాలు రాలేకపోయాయి. అయినా కూడా ఈమె కనీసం చిన్న పాత్ర అయినా చేద్దామని అనుకుని మరి కొన్ని సినిమాలలో నటించినా,  ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో  2019లో పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. అయితే ఇటీవల ఈమె పెళ్లి కి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: