మొదటి సినిమాతో హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ మొదటి సినిమా విడుదల కాకముందే మూవీ నుండి బయటకు వచ్చిన పాటలు, టీజర్ల ద్వారానే యూత్ లో క్రేజ్ ను తెచ్చుకున్న హీరోయిన్ కృతి శెట్టి. ఈ సినిమాలో తన అందచందాలతో అమాయకత్వపు చూపులలో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. నాని హీరోగా నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ' సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ. నాగార్జున మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న 'సోగ్గాడే చిన్నినాయన' సినిమా కు సీక్వెల్ అయిన 'బంగార్రాజు' సినిమా లోనూ నాగచైతన్యకు జంటగా నటించడానికి ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటితో పాటు రామ్ పోతినేని తో కూడా ఒక సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇలా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న ఈ హీరోయిన్ మరొక కొత్త అవతారం ఎత్తింది. జీ తెలుగు ఛానల్ వారు 'ముత్యమంతా ముద్దు' అని ఒక కొత్త సీరియల్ ను ప్రారంభిస్తున్నారు. ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమో ను తాజాగా విడుదల చేయగా, ఆ సీరియల్లో కృతి శెట్టి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఈ సీరియల్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న నటితో కలిసి కృతి శెట్టి సీరియల్ ఇతివృత్తాన్ని చెప్పే ప్రయత్నం చేసింది. ముత్యమంతా ముద్దు అనే సీరియల్లో కృతి శెట్టి నటించడం లేదు. కేవలం ధారావాహికను జనాల్లోకి తీసుకెళ్లేందుకు సీరియల్ టీం ప్రమోషనల్ లో భాగంగా ఈ వీడియోని విడుదల చేశారు. ఈ ప్రోమోని చూసిన కొంతమంది బేబమ్మ సీరియల్ ప్రమోషన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు .ఈ ప్రోమోతో కృతి శెట్టి టివి ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: