ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలయి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నపుడు, సినీ పరిశ్రమలో అందరూ సురేష్ బాబును నిందించిన వారే, థియేటర్లోనే విడుదల చేయాలని చెప్పిన వారే, కానీ కరోనా కారణంగా ఇప్పటికే చాలా రోజులు వెయిట్ చేశారు. లాభమో నష్టమో ఓటిటి బాట పట్టారు. ఇప్పుడదే కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ నటనకు ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. ఈ సంతోష సమయంలో సురేష్ బాబు మరో నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెరకెక్కించిన అడ్డాల శ్రీకాంత్ డైరెక్షన్ లోనే ఈ సినిమా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటీనటులకు సీక్వెల్ లోనూ అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు ముగిసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చిత్రపురి కోడై కొస్తోంది. సీక్వెల్ కథను రెడీ చేయమని శ్రీకాంత్ అడ్డాలకు చెప్పారట, ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.