సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కన్నడ సోయగం రష్మిక మందన్న హవా నడుస్తుంది. చిత్రసీమకు పరిచయమైన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఎదిగి పోయింది. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ తో రానున్న రోజుల్లో భారతీయ సినిమా ఇండస్ట్రీని ఏలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రష్మిక మండన్న కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉంది. కేవలం ఎంట్రీ ఇచ్చిన 5 సంవత్సరాల్లోనే భారతదేశంలో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో ఒకరిగా మారింది. ఆమె చేతిలో ఇప్పుడు దేశంలోని వివిధ భాషలకు సంబంధించిన ఆరు కంటే ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది రష్మిక దేశంలోనే అగ్ర హీరోయిన్లలో ఒకరని రుజువు చేస్తోంది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పాన్ ఇండియా మూవీ "పుష్ప"లో హీరోయిన్ గా చేస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దేశంలోని అన్ని ముఖ్యమైన భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రష్మిక కెరీర్లోనే అతి పెద్ద ప్రాజెక్ట్. ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 

మరోవైపు శర్వానంద్ తో కలిసి "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమాలో నటిస్తోంది. దీనికి తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బాలీవుడ్ లో తన మార్కును చాటుకోవడానికి సిద్ధంగా ఉంది ఈ బ్యూటీ. హిందీలో ఆమె హీరోయిన్ గా శాంతను బాఘ్చి దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా స్పై థ్రిల్లర్ "మిషన్ మజ్ను" రూపొందుతోంది. వికాస్ బెహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ "గుడ్ బై" చిత్రంలోనూ కనిపించబోతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ కెవి రూపొందించబోయే ద్విభాషా చిత్రంలో కూడా రష్మిక హీరోయిన్ అంటూ వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితం కానున్న ఈ చిత్రం కోసం రష్మికతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో తమిళ స్టార్ శివ కార్తికేయన్ లీడ్ హీరోగా నటించనున్నాడు. ఎన్ని చిత్రాలు చేతిలో ఉన్నప్పటికీ రష్మికను మరో ఆఫర్ కూడా పలకరించినట్టు తెలుస్తోంది. 'చలో' బ్యూటీతో మరో బిగ్ ప్రాజెక్ట్ కోసం కూడా చర్చలు జరుగుతున్నాయని వినికిడి. ప్రస్తుతానికి రష్మిక చేతిలో మొత్తంగా 6 పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సినిమాలు గనుక విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తే రానున్న రోజుల్లో రష్మిక అనే దేశంలో టాప్ హీరోయిన్ అవుతుంది. ఇదంతా చూస్తుంటే రష్మిక ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ స్థానంపై కన్నేసినట్టు అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: