మన దేశంలో ఈ కామర్స్ రంగం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇటీవలి కాలంలో మరీ ముఖ్యంగా కరోనా ఎంట్రీ నుంచి గణనీయమైన అభివృద్ధి ఉన్నట్లు పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రతీ ఒక్కరు ఆన్‌లైన్‌‌లోనే తమ వస్తువులను ఆర్డర్ చేసేందుకు మొగ్గు చూపడాన్ని మనం గమనించొచ్చు. ఈ క్రమంలోనే ఈ ఈ-కామర్స్ రంగం సినీ స్టార్స్‌కు ఇన్‌కం తెచ్చిపెడుతోంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ప్రమోషన్ చేస్తూ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇందుకు ఈ -కామర్స్ దిగ్గజాలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవరెవరితో ఈ కామర్స్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయంటే..


బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ, మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, అక్కినేని కోడలు సమంత, యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కియారా పలు ఈ కామర్స్ దిగ్గజానికి ప్రచారకర్తలుగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సమంత కన్ఫర్మ్ చేసింది. ఐదుగురు స్టార్స్ ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. భారతీయ అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజ సంస్థ తమను ప్రచారకర్తలుగా నియమించుకున్నట్లు వివరించింది.ఈ క్రమంలో ఈ ఐదుగురి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ ముచ్చట్ల గురించి చర్చ జరుగుతోంది. హృతిక్ తన ఫొటోను షేర్ చేసి కియారా అద్వానీకి ట్యాగ్ చేశాడు. ‘ఇది చాలా మంచిదని మీరు అనుకుంటున్నారా?’ అని కియారాను ప్రశ్నించగా, ఆమె ‘సరిపోదు. కానీ, ఇప్పుటి వరకూ మంచిదే’ అంటూ విజయ్ దేవరకొండను ట్యాగ్ చేసింది. విజయ్ కూడా ప్రతిస్పందించారు. ‘అందమైనది..కానీ,సరిపోదు. దీనికి కొంత రౌడీయిజం అవసరం’ అని పేర్కొంటూ సమంత అక్కినేని ట్యాగ్ చేశాడు. ‘మీరు ఆమోదిస్తారా?’ అని ప్రశ్నించాడు.అందుకు సమంత ‘హ..హ..హ.. లేదు.. కానీ, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలుసు అని’ చెప్తూ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్‌ను ట్యాగ్ చేసింది.  ఇలా మొత్తంగా ఐదుగురు స్టార్స్ ఈ-కామర్స్ ఎవరి భాషలో వారు ప్రచారం చేస్తుండటం ఆసక్తికరం. ఈ ప్రచారం కోసం కోట్లాది రూపాయల డీల్‌కు వీరు ఓకే చెప్పారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: