సూపర్ స్టార్ రజినీకాంత్ మెయిన్గా తమిళ్ సినిమాల్లోనే నటించినా ఇండియా వైడ్గా మార్కెట్ ఉంది. ఇంటర్నేషనల్ వైడ్గా పాపులారిటీ సంపాదించాడు. డబ్బింగ్ సినిమాలతో జపాన్ లాంటి చోట్లా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక రజనీలాగే ధనుష్ కూడా మార్కెట్ పెంచుకునేపనిలో పడ్డాడు. ముఖ్యంగా రజనీకాంత్ కు భారీగా ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగునాట స్టార్డమ్ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ధనుష్కి తమిళనాట సెపరేట్ ఇమేజ్ ఉంది. కమర్షియల్ స్టోరీస్కి దూరంగా రగ్గడ్లుక్తో మాస్ స్టోరీస్ చేస్తుంటాడు. ఈ పేద కథలతోనే తెలుగు మార్కెట్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. అయితే ఇప్పుడీ గుర్తింపుని స్ట్రాంగ్ మార్కెట్గా మార్చుకోవడానికి స్ట్రయిట్ తెలుగు మూవీస్ చేస్తున్నాడు.
ధనుష్ ఇప్పటికే తెలుగులో ఒక సినిమాకి సంతకం చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు, తెలుగులో మరో సినిమాకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు ధనుష్. సితార ఎంటర్టైన్మెంట్స్లో ధనుష్ ఒక సినిమా చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
ఇప్పుడు ధనుష్ కోసం కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్.. మాలీవుడ్.. శాండిల్ వుడ్.. బాలీవుడ్.. ఆఖరికి హాలీవుడ్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. రజినీ కాంత్ అల్లుడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మిలియన్ల కొద్దీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు ఈ హీరో. దీంతో ధనుష్ రజినీకాంత్ ను మించిపోతున్నాడు.