దాంపత్య జీవితంలో సంతానం అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరూ పిల్లలను కనడం తోనే పరిపూర్ణమైన దాంపత్య జీవితానికి మార్గదర్శకులు అవుతారు. ఇక ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. అయితే మనిషి పుట్టుక అనేది ఎవరు ?ఊహించలేం. ఒక్కోసారి మనిషి పుట్టుక  ఒక్కరిగా కాకుండా... ఒకేసారి ఒకే తల్లి కడుపున ఇద్దరు లేదా ముగ్గురు అంతకుమించిన కవల పిల్లలు కూడా జన్మించేలా ఉంటుంది. ఈ క్రమంలోనే కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన‌ సెలబ్రిటీ దంపతుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ లో మనం తెలుసుకుందాం. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ - హీరోయిన్ మాన్యత 2008 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే సంజయ్ ద‌త్‌కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి.
2008 లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు 2010లో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వీరిలో ఒక అబ్బాయి... ఒక అమ్మాయి. అబ్బాయికి ష‌హ‌రా అమ్మాయికి ఇక్రాన్‌ అని పేర్లు పెట్టారు. టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసుడిగా ఉన్న మంచు విష్ణు 2009లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న కుమార్తె వెరోనికా రెడ్డిని పెళ్లాడారు. వీరికి మొత్తం నలుగురు పిల్లలు. అయితే తొలి సంతానంగా ఇద్దరు క‌వ‌ల‌ ఆడపిల్లలు పుట్టారు. వీరికి అరియానా-వివియానా అనే పేర్లు పెట్టారు. ఆ తర్వాత కూడా విష్ణు దంపతులు ఓ అబ్బాయి, మ‌రో అమ్మాయికి జన్మనిచ్చారు.
టాలీవుడ్ సీనియర్ యాంకర్ ఉదయభాను ముందుగా ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆతర్వాత అతడితో మనస్పర్ధలు రావడంతో విడిపోయి విజయ్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి కవల ఆడపిల్లలు జన్మించారు. ఉదయభాను తన కుమార్తెలకు దివి నక్షత్ర, భూమి ఆరాధ్య అని పేర్లు పెట్టారు. ప్రముఖ పోర్న్ స్టార్ సన్నీలియోన్ తన సహనటుడు డానియల్ వెబ‌ర్‌ని 2011లో వివాహం చేసుకుంది. స‌న్నీ 2017లో ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చింది. వీరు పేర్లు అష‌ర్‌, నోహా.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ భార్య‌ 2017 లో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. వీరిలో ఒక అమ్మాయి కాగా... మరొకరు అబ్బాయి. ఇక హీరో భరత్ 2013లో తన చిన్నప్పటి గ‌ర్ల్‌ ఫ్రెండ్ పెళ్లాడారు. 2018 లో వీరికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వీరికి ఆద్య‌న్‌, జెన్ అని పేర్లు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: